• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: MLA

NDL: కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేల్పనూరులో అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.

April 10, 2026 / 06:29 PM IST

నిబద్ధతతో జనగణన పూర్తి చేయాలి: జేసీ

ATP: జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ సూచించారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న శిక్షణా తరగతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, ప్రణాళికల రూపకల్పనకు జనాభా లెక్కలు ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు.

April 10, 2026 / 06:11 PM IST

పొరుమామిళ్లకు నూతన విద్యుత్ అధికారి

KDP: పొరుమామిళ్ల విద్యుత్ శాఖ ఏడీఈగా బైరి రవి కుమార్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఈ మహేశ్, సిబ్బంది స్వాగతం పలికారు. పోరుమామిళ్ల, కాసినాయన, కలసపాడు మండలాలలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

April 10, 2026 / 06:10 PM IST

ప్రజా వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరులోని R&B గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ప్రజల నుంచి రెవెన్యూ, పింఛన్లు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోనేగండ్లలో కార్యకర్తల సమావేశంలో MyTDP యాప్ వినియోగంపై చర్చించారు.

April 10, 2026 / 06:07 PM IST

జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

AKP: గంధం అమావాస్య పండగ సందర్భంగా ఎస్ రాయవరంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఇవాళ సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని సూచించారు. ఈ పోటీల్లో 30 టీమ్స్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు టోర్నమెంటు కొనసాగుతుందన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.

April 10, 2026 / 06:04 PM IST

రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ

WG: నరసాపురం మండలం సరిపల్లి గ్రామ రైతులకు శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ పాసు పుస్తకాలను అందజేశారు. భూ సమస్యల పరిష్కారం, రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సరిపల్లి రెవెన్యూ పరిధిలో మొత్తం 627 మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరయ్యాయని వివరించారు.

April 10, 2026 / 06:03 PM IST

శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం

TPT: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ ప్రక్రియతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సుమారు 16 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజును భరిస్తుండగా, 900 మంది పేదలకు ఉచితంగా భూమి అందజేస్తున్నారు.

April 10, 2026 / 06:03 PM IST

వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులు

NLR: కుటుంబ కలహాల నేపథ్యంలో దగదర్తి మండలం తురుమెళ్ల పంచాయతీ లక్ష్మి నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. కుటుంబ సభ్యులు 112 కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే దగదర్తి ఎస్సై జంపాని కుమార్ తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆత్మహత్యాయత్నంకు పాల్పడుతున్న వ్యక్తిని లొకేషన్ ఆధారంగా కాపాడారు.

April 10, 2026 / 06:00 PM IST

హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

SS: హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎం.వెంకటాపురం గ్రామంలోని మామిడి తోట వద్ద నిందితులు రాజు, శ్రేయాస్, వేణుగోపాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి థార్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో వినయ్ కుమార్‌పై నిందితులు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

April 10, 2026 / 06:00 PM IST

పందిళ్లపల్లిలో పోషణ అవగాహన సమావేశం

BPT: పందిళ్లపల్లి ICDS కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీడీపీవో ఝాన్సీ పోషణ పక్వాడ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ జయకుమార్ పిల్లల్లో పోషకాహార లోపం, ఊబకాయం నివారణకు సూచనలు ఇచ్చారు. త్రివేణి ఆటల ఆధారిత శిక్షణపై చర్చించగా, పీఎంఎంవీవై, సీఎఫ్‌ఎంఎస్, పోషణ ట్రాకర్ నమోదు అంశాలను వివరించారు.

April 10, 2026 / 06:00 PM IST

జనగణనపై శిక్షణ తరగతులు ప్రారంభం

ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇవాళ జనగణనపై సచివాలయ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, మాస్టర్ ట్రైనర్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా వచ్చే జనాభా గణనను, కుల గణనను పక్కాగా, రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా నిర్వహించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. జనగణనను పక్కాగా నిర్వహించాలన్నారు.

April 10, 2026 / 06:00 PM IST

గిరిజన పీజీఆర్ఎస్‌కు 7 వినతులు

PPM: గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా ఐటీడీఏ పనిచేస్తుందని జాల్లా ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాల్‌లో నిర్వహించిన గిరిజన సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ఏడుగురు గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు.

April 10, 2026 / 05:58 PM IST

వ్యవసాయ శాఖ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

ప్రకాశం: మర్రిపూడిలో వ్యవసాయశాఖ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యాలయంకు పలువురు అనేక పనులు నిమిత్తం వస్తుంటారని అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నందున రైతులుకు కూడా చల్లని కుండనీరును అందించాలని చలివేంద్ర ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

April 10, 2026 / 05:58 PM IST

ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాలి: సీఐటీయూ

AKP: పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ పరవాడలో పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి 1.43 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఏడాది కావస్తున్న నిర్మాణ పనులు చేపట్టలేదని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అన్నారు.

April 10, 2026 / 05:49 PM IST

తంటికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భరత్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తంటికొండ గ్రామానికి చెందిన రైతులు అందరూ రైతు సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పంటలకు సరైన ధర పొందాలని సూచించారు.

April 10, 2026 / 05:45 PM IST