KRNL: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారన్నారు.
W.G: భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భీమవరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
KDP: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. గత 24 గంటల్లో 47 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన 554 క్వార్టర్ బాటిళ్లు, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.
PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామంలో మంగళవారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీ.రత్నం, ఎంపీపీ వీర భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NTR: నందిగామ పట్టణం అనాసాగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రంను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రయాణికులు, సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీరుస్తాయని తెలిపారు.
నంద్యాల పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VSP: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖలోని డాబాగార్డెన్స్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శకులైన అంబేద్కర్ ఆలోచనలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
ELR: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా.బీ.ఆర్ అంబేద్కర్ అని జేసీ అభిషేక్ గౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యంగంలో మనందరికీ కల్పించిన హక్కులేనని జేసీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
VZM: డెంకాడ మండలం దొడ్డి బాడువ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.
TPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరైయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, తదితర నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కలెక్టర్ నిశాంత్, ఎమ్మెల్యే షాజహాన్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు. పీఎం అజయ్ పథకం కింద 25 మంది లబ్ధిదారులకు రూ.27 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.
E.G: BR అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మంగళవారం బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ ప్రజలతో కలిసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త, విద్యా స్ఫూర్తి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ‘జై భీమ్- జై భీమ్’ అంటూ నినాదాలు చేశారు.
KKD: సామర్లకోట మండలం హుస్సేన్పురం గ్రామానికి చెందిన ముప్పిడ ప్రణీత నేషనల్ స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాద్ ప్రణీతను పూలమాలతో సత్కరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, ప్రభుత్వ సహాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నెల్లూరు 33వ డివిజన్లో రూ.35 లక్షలతో నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ నియోజకవర్గంలో ప్రతి వార్డు, గ్రామాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి దేహాన్ని ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు అతిగా మద్యం సేవించి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.