GNTR: కాకుమాను మండలం అప్పాపురం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. పసిపిల్లలకు పౌష్టికాహారం కింద పాడైన గుడ్లు ఇస్తుండటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురంలో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో ఫెర్రర్ చేసిన సేవలను మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఈ ఏడాది ఆర్డీటీకి FCRA అనుమతి సాధించి, సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగేలా కృషి చేశామని పేర్కొన్నారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని లోకేశ్ కొనియాడారు.
AKP: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలమంచిలి ఎంపీపీ రాజాన శేఘ సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జలధార-జల హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలన్నారు. సాగునీటి కాలువల మరమతులు చేయించాలన్నారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ప్రస్తుతం 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డీసీవీ ఛైర్మన్ బాబు ఆదేశించారు.
PLD: నరసరావుపేట (M) ములకలూరులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు లాభాలున్నాయని తెలిపారు. పరిశుభ్రత కోసం ప్రజలంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలని ఆయన సూచించారు.
సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
NTR: విజయవాడలో దేవాదాయ శాఖ ఏసీ కె.శాంతిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో ఐదు రోజులపాటు విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏసీబీ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
KDP: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా పెంచారు. లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించి, ఆధార్ వివరాలు పరిశీలిస్తున్నారు.
అన్నమయ్య: రాయచోటిలోని రాయుడు కాలనీలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి “వాక్ విత్” కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్ల సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయగా, వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగతావాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
W.G: తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇటీవల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో MPP శేషులత ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. MPP లేకుండానే సమావేశం నిర్వహిస్తారా అన్న మీమాంస నెలకొంది.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. బుధవారం చాగలమర్రిలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 41.8, కౌతాళంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడి భగభగలతో మధ్యాహ్నం పట్టణాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాల్పుల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఈ నెల 11న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ టీడీపీ మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి తెలిపారు. మండలంలో రూ.4 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్చవల్గా ప్రారంభిస్తారని ఆయన అన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ దేవత గోకులాంబ అమ్మవారి శతాబ్ది ఉత్సవాల్లో బుధవారం రాత్రి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకులాంబ అమ్మవారి ఉత్సవాలు నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
ATP: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 15వ తేదీ నుంచి సీసీటీవీ కెమెరా ఇన్ స్ట్రాలేషన్ కోర్సు పై ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శాంతి ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉండి టెన్త్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 9705091727 సంప్రదించాలన్నారు.
కృష్ణా: పెడన మండలం మడిచర్ల గ్రామంలో చెరువును సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావుతో కలిసి కలెక్టర్ బాలాజీ ఈరోజు పరిశీలించారు. చెరువు స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని చెరువులను వర్షపు నీటితో నింపుకొని రైతులకు ఏలాంటి కొరత లేకుండా ఎల్లప్పుడూ సాగునీరు అందిస్తామన్నారు.