కృష్ణా: పెడన మండలం మడిచర్ల గ్రామంలో చెరువును సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావుతో కలిసి కలెక్టర్ బాలాజీ ఈరోజు పరిశీలించారు. చెరువు స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని చెరువులను వర్షపు నీటితో నింపుకొని రైతులకు ఏలాంటి కొరత లేకుండా ఎల్లప్పుడూ సాగునీరు అందిస్తామన్నారు.