• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వేదిక్ వర్సిటీలో ‘చిరుత’ కలకలం

తిరుపతి: అలిపిరి సమీపంలోని వేదిక్ వర్సిటీ ఆవరణలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా రాత్రివేళల్లో ప్రధాన రోడ్ల వెంబడి తిరుగుతుండటాన్ని సీసీ కెమెరాల సాయంతో సిబ్బంది కనిపెట్టారు. విషయం తెలిసి వర్సిటీ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

December 17, 2024 / 01:54 PM IST

సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

AKP: ఈ నెల 20, 21, 22వ తేదీల్లో నర్సీపట్నంలో జరుగు సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ.కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఈ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా 21న బహిరంగ సభ జరుగుతుందన్నారు.

December 17, 2024 / 01:53 PM IST

చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేశ్: బుద్ధ వెంకన్న

కృష్ణా: నూజివీడులో మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొన్న ఘటన టీడీపీ నేతలు అందరికీ బాధ కలిగించిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి వెళ్ళిన ఫొటోలను ఆయన ప్రదర్శించారు. నీచంగా దూషణలు చేసి.. చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేశ్ అన్నారు. అటువంటి నాయకుడితో తిరగడం మంచి పద్ధతి కాదన్నారు.

December 17, 2024 / 01:49 PM IST

నరసారావుపేట మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

PLD: నరసరావుపేట మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు కొనసాగుతున్నట్లు ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి తెలిపారు. మంగళవారం పాలపాడు, ములకలూరు గ్రామాలలోని సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులకు సంబంధించి నమోదు, చేర్పులు, మార్పులను పర్యవేక్షించారు. ఆయా గ్రామాల్లోని వారు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

December 17, 2024 / 01:49 PM IST

చెత్త నిలువలు ఎప్పటికప్పుడు తొలగించాలి: కమిషనర్

TPT: మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు చెత్త నిల్వలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా సిబ్బందికి సూచించారు. మంగళవారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు చెత్త నిల్వలను తొలగించడంతో పాటు మురుగునీరు ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలన్నారు.

December 17, 2024 / 01:49 PM IST

ఆదర్శ మహిళా ఉద్యమ నేత చండ్ర రాజకుమారి

ELR: మహిళా ఉద్యమనేత చండ్ర రాజకుమారి ఆదర్శనేత అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని అన్నారు. మంగళవారం ఏలూరు కొత్తపేట కాలనీలో చండ్ర రాజకుమారి 6వ వర్ధంతి సభ నిర్వహించారు. చండ్ర రాజకుమారి మహిళా హక్కుల ఉద్యమ నేత అని మహిళల హక్కుల రక్షణకు అనేక పోరాటాలు చేశారన్నారు.

December 17, 2024 / 01:47 PM IST

హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు: మంత్రి సవిత

ATP: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకుకరానివ్వొద్దని బీసీ సంక్షేమ శాఖా అధికారులకు, హాస్టల్ సిబ్బందికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 13 మంది బాలికలు అసస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత విద్యార్తులతో ఫోన్‌లో ఆరా తీశారు.

December 17, 2024 / 01:45 PM IST

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండగా ఉంటారు: ప్రదీప్ రెడ్డి

KRNL: కౌతాళం మండలంలోని బదినేహాల్ గ్రామ సర్పంచ్ మాల నరసప్ప ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి మాల నరసప్ప కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్య పడొద్దని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తరఫున రూ. 25 వేలు నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.

December 17, 2024 / 01:42 PM IST

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై శిక్షణ

KDP: ఖాజీపేట మండలంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దివిజ.. సమానమైన, న్యాయమైన, సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమమునకు మండలంలోని సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.

December 17, 2024 / 01:41 PM IST

రాష్ట్ర అభివృద్ధి, రైతుల ప్రయోజనాలే లక్ష్యం: దేవినేని

కృష్ణా: రాష్ట్ర అభివృద్ధి, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మంగళవారం ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును పక్కా ప్రణాళికతో ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఉమ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఉమ Xలో పేర్కొన్నారు.

December 17, 2024 / 01:40 PM IST

రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ఈ రెవెన్యూ సదస్సులు

KRNL: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ఈ రెవెన్యూ సదస్సులని పెద్దకడబురు మండల తహసీల్దార్ శ్రీనాథ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. పలువురు రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 45 రోజుల్లోగా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

December 17, 2024 / 01:40 PM IST

ఆధార్ నమోదుకోసం ప్రత్యేక శిబిరాలు

TPT: తిరుపతిలో 6 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ సెంటర్ దోబీ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, సప్తగిరి నగర్, భవానీ నగర్, యశోధ నగర్, పూసల వీధి, వినాయక నగర్, తాతానగర్, STV నగర్, నవాబుపేటలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

December 17, 2024 / 01:37 PM IST

నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తాం : నారాయణ

NLR: జిల్లాను స్మార్ట్ సిటీ చేసేలా అన్నీ చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా ఎండీ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

December 17, 2024 / 01:36 PM IST

‘గ్రామాల అభివృద్ధితో పాటు, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి’

KRNL: సర్పంచులు గ్రామాల అభివృద్ధితో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈఓఆర్డి మల్లికార్జున, ట్రైనర్ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం బేతంచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో రెండో విడత సర్పంచులు, మండల స్థాయి అధికారులకు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామాలకు వచ్చే నిధులు, ప్రణాళికలు, వివిధ శాఖలపై అవగాహన కల్పించారు.

December 17, 2024 / 01:32 PM IST

18న పుంగనూరులో డయల్ యువర్ డీఎం

CTR: పుంగనూరు RTC డిపోలో ప్రయాణికుల సూచనలు, సమస్యలు తెలుసుకునేందుకు 18న (బుధవారం )డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపోమేనేజర్ సుధాకరయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రయాణికులు ఈ నంబర్9100941850కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని డీఎం పేర్కొన్నారు.

December 17, 2024 / 01:29 PM IST