ASR: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం హుకుంపేట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన జీ.బొడ్డపుట్టు జీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యను అందించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీచేసి పలు సూచనలు చేశారు. అనంతరం డాబావలస మెయిన్ రోడ్డు పరిశీలించారు.
PPM: పార్వతీపురం టీడీపీ నాయకులు స్పీకర్ అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. రాయఘడ మజ్జి గౌరమ్మ దర్శనానికి వెళుతున్న స్పీకర్ను పార్వతీపురంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, పట్టణ అధ్యక్షులు రవికుమార్, మాజీ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, భానుప్రసాద్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానం పలికారు.
KDP: కోవిడ్ కార్మికులు, అడిషనల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కడపలోని కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కృష్ణా: నూజివీడు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కార్గో పాయింటును మంగళవారం కార్గో మేనేజర్ జి లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీకి కార్గో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈనెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు డోర్ డెలివరీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సాగునీటి సంఘం DC అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో సంతమాగులూరు మండల డీసీ అధ్యక్షుడిగా అడవిపాలెంకు చెందిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా ఏల్చూరు గ్రామానికి చెందిన నాసరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. నీటి సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
ప్రకాశం: తాళ్లూరు మండలంలో YS షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ బాలికల వసతి గృహంలో దర్శి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో షర్మిలను ముఖ్యమంత్రిగా చేయడమే మన తదుపరి బాధ్యత అన్నారు.
W.G: పెరవలి నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ ఛైర్మన్గా బూరుగుపల్లి శ్రీనివాస్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెరవలి డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని కాలువల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
VZM: రాష్ట్ర రవాణా క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిసెంబర్ 20వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి ఆరోజు మధ్యాహ్నం 1 గంటలకు విశాఖ నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలో విజ్జి స్టేడియంను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు పార్వతీపురం బయలుదేరి వెళ్లనున్నారు.
SKLM: శ్రీకాకుళం రెవెన్యూ మండలంలో పని భారం అధికంగా ఉండటం వలన అర్బన్, రూరల్ 2 మండలాలుగా విభజించేందుకు కోరుతూ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వినతి అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మొగదాలపాడును రెవెన్యూ విలేజ్గా మారుస్తూ మ్యాప్ సిద్ధం చేయాలని ...
KDP: కాజీపేట గ్రామ పంచాయతీలోని టీచర్స్ కాలనీలో రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తుందని కాలనీ వాసులు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయం తెలుసుకొన్న ఎంపీడీవో టీచర్స్ కాలనీని మంగళవారం సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై స్పందించిన ఎంపీడీవోకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనడంతో డ్రగ్స్ పై అవగాహన కలుగుతుందని ప్రిన్సిపాల్ డా నాయక్ అన్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ సాకారం కొరకు గ్రామాలలో అవగాహణ కల్పించాలని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఎన్ఎస్ఎస్ పీవోలు సూచించారు.
NDL: పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ సమీపంలో ఉన్న సోలార్ కంపెనీలో కాపర్ వైర్ చోరీకి గురైనట్లు కంపెనీ వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాపర్ వైర్ చోరీ కేసులో ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ముద్దాయిల నుండి 240 కేజీల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు.
AKP: ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మాడుగుల ఎంపీడీవో కొంకి అప్పారావు కోరారు. మంగళవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆధార్ తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ కొండాజీ, శాంతి, సరోజినీ, దేవి పాల్గొన్నారు.
VZM: నైరుతి బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఈనెల 19న పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని కలెక్టర్ పేర్కొన్నారు.
KDP: అమృత్సర్ నుంచి ఓ భక్తుడు గత 50 రోజులుగా సైకిల్ యాత్రతో రామేశ్వరానికి బయలుదేరారు. అమృత్సర్ జిల్లాలోని బొమ్మ గ్రామానికి చెందిన బాబా బ్రాగ్సింగ్ అనే భక్తుడు దేవుళ్ళ దర్శనం సైకిల్ యాత్రతో బయలుదేరారు. మంగళవారం ఉదయం కొండాపురానికి వచ్చారు. ఇక్కడి నుంచి సైకిల్ యాత్రతో తిరుపతి, రామేశ్వరానికి వెళుతున్నట్లు తెలిపారు.