కృష్ణా: కలిదిండి మండలం పోతుమర్రు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన అనే విధంగా మండల మేజిస్ట్రేట్, అన్ని శాఖల అధికారులు ప్రజల వద్దకే వచ్చారన్నారు. ప్రజలందరూ తమ సమస్యలు వివరించి పరిష్కరించుకోవాలని సూచించారు.
SKLM: పోలీసు ఉద్యోగులలో మధ్య ఐకమత్యానికి క్రీడాలే ప్రతీకగా నిలుస్తాయని VSKP రేంజ్ DIG గోపీనాథ్ జట్టి అన్నారు. మంగళవారం ఎచ్చెర్ల పోలీసు పరేడ్ గ్రౌండు నందు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2024ను ప్రారంభించారు. పోలీసులు మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు.SKLM SP మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.
GNTR: ఎరువులు, విత్తనాల పంపిణీలలో డీలర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టరాదని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ అన్నారు. తెనాలి వ్యవసాయాధికారి కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 50% పంట కోతలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.
E.G: శంఖవరం మండలంలోని నీటి సంఘాల ఎన్నికల్లో కన్నమ్మ చెరువు సంబంధించి కొంతంగి బద్ది లోవరాజును ఛైర్మన్గా, ఉపాధ్యక్షుడుగా సర్నం నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికయిన సభ్యులు ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి, రైతు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.
ASR: పెన్షనర్స్ ఉద్యమకారుడు డీ.ఎస్.నకరాకు పాడేరులో ఘన నివాళులర్పించారు. 43వ జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం పాడేరులోని పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఏటీవో నాగభూషణం రాజు, రిటైర్డ్ ఎస్డీసీ టీ.అప్పారావు నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో పెన్షన్స్ సాధనకు నకరా విశేష కృషి చేశారని అన్నారు. పెన్షనర్లకు చిరాస్మరణీయుడని కొనియాడారు.
ELR: శిక్షణ ద్వారా సచివాలయ ఉద్యోగులు నైపుణ్యం సాధించాలని ఉంగుటూరు EOPRD చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయం హాల్లో సచివాలయ డిజిటల్, ఇంజనీరింగ్, వెల్ఫేర్ సహాయకులకు శిక్షణా తరగతులు జరిగాయి. పలు అంశాలపై రిసోర్స్ పర్సనల్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం 25 గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
E.G: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. రాజమండ్రిలో గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేయడం కన్నా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్చంధ సంస్థలు ప్రతినిధులను సత్కరించారు.
CTR: పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథిగృహంలో రేపు (బుధవారం )LSDG స్థానికికరణ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లీలా మాధవి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు మామిళ్ళపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఏఈవో మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పంట పొలాల్లో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో అయూబ్, అల్తాఫ్ ముబారక్, ఫయాజ్, అజ్మత్ పాల్గొన్నారు.
ELR: జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీని శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్లతో కలిసి ఏలూరు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందనం పొదుపుపై అవగాహన కలిగించే పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఇందనాన్ని పొదుపు చేయడం ద్వారా భావి తరాలకు మంచి భవిష్యత్ను ఇవ్వవచ్చని అన్నారు.
CTR: పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం ఉదయం అఖిలభారత పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు ప్రసంగిస్తు తమ అనుభవాలను పంచుకున్నారు.
ATP: ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు కేరళలో జరిగే అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలకు విద్యార్థి సాయికుమార్ ఎంపిక అయ్యారు. పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని మంగళకర డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాయికుమార్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలలో ఎస్కే యూనివర్సిటీకి ఎంపికైనట్టు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు.
CTR: కార్వేటినగరం మండలం టీడీపీ కార్యాలయంలో ఇటీవల ఎంపికైన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సమావేశం నిర్వహించారు. కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాలకు సంబంధించిన వారు దీనికి హాజరయ్యారు. చెరువుల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే థామస్ వారికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యేని సన్మానించారు.