• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవం

NLR: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు గౌస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతం బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, హాజరతయ్య, వేణు, తదితర పెన్షనర్లు పాల్గొన్నారు.

December 17, 2024 / 04:16 PM IST

హెచ్ఎల్సీ నార్త్ కెనాల్ ఛైర్మన్‌గా రాజారెడ్డి ఎన్నిక

ATP: అనంతపురంలో హెచ్ఎల్ఎసీ నార్త్ కెనాల్ డిస్ట్రిబ్యూషన్ ఛైర్మన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెద్దవడుగూరు మండలం దిమ్మగుడికి చెందిన రాజారెడ్డిని ఛైర్మన్‌గా, పామిడి మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మీనుగ వెంకటేశ్‌ను వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ చౌదరి, బొల్లు శ్రీనివాస రెడ్డి, జింకల సంజీవ, రాజేశ్ పాల్గొన్నారు.

December 17, 2024 / 04:09 PM IST

CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: మలికిపురం మండలంలోని విశ్వేశ్వరాయపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 5వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని 11 మంది బాధిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు చెక్కులను అందజేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

December 17, 2024 / 04:07 PM IST

పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్‌

PLD: చిలకలూరిపేట పట్టణంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను కమిషనర్‌ శ్రీహరిబాబు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. కళా మందిర సెంటర్, ఆర్యవైశ్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1, 2వ డివిజన్ల పరిధిలోని వివిధ గార్బేజ్‌ల వద్ద చెత్త సేకరణ ఆలస్యం కాకుండా పారిశుధ్య పనులు త్వరగా జరిగేలా చూడాలని కార్మికులకు ఆదేశించారు.

December 17, 2024 / 04:07 PM IST

ఉయ్యూరులో 13 మంది జూదరులు అరెస్ట్

కృష్ణా: ఉయ్యూరు మండలంలోని పెద్ద ఒగిరాలలో 13 మంది జూదరులు అరెస్టయ్యారు. పోలీసుల వివరాల మేరకు.. పెద్ద ఒగిరాలలోని బందరు కాలువ గట్టుపై మంగళవారం జూదం ఆడుతున్నవారిపై దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 8 బైకులు, 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.46 లక్షల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

December 17, 2024 / 04:04 PM IST

ధాన్యం కోనుగోళ్లును పరిశీలించిన ఏవో

ASR: కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం రైతు సేవా కేంద్రం పరిధిలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి డీ.ఉమాదేవి ధాన్యం కొనుగోళ్లును పరిశీలించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ధాన్యం తేమ శాతం 17శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్మును ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.

December 17, 2024 / 04:02 PM IST

కూనవరం మండల సర్వసభ్య సమావేశం

ASR: కూనవరం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ పాయం రంగమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సభ్యులందరూ పలు సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో పాటు విద్యుత్ సరఫరా, లో వోల్టేజ్ వంటి సమస్యలు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

December 17, 2024 / 04:01 PM IST

‘సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకోండి’

ATP: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.

December 17, 2024 / 04:01 PM IST

‘సైక్లింగ్‌తో ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి’

కృష్ణా: గన్నవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్ ఆవరణములో మంగళవారం ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం పి ఉమాదేవి మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండేందుకు విద్యార్థి దశ నుండి సైకిల్ తొక్కడం అలవర్చుకోవాలన్నారు. ‘సైకిల్ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి.. అందమైన జీవితాన్ని కలలు కనండి’ అనే నినాదంతో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని పీడీ ధనియాల నాగరాజు పర్యవేక్షించారు.

December 17, 2024 / 03:59 PM IST

కోడూరు డీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం

కృష్ణా: జి. కొండూరు మండలం కోడూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక మంగళవారం ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా తోలుకోడుకు చెందిన ఇనుగంటి శోభన్ బాబు, ఉపాధ్యక్షుడిగా వెల్లటూరుకు చెందిన ఎలిసల సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ధ్రువపత్రాలు అందజేశారు. దీంతో పలువురు కూటమి నాయకులు అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు.

December 17, 2024 / 03:58 PM IST

‘ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలి’

కడప: జమ్మలమడుగు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరణాల శివ నారాయణ ఆధ్వర్యంలో చేనేతల విద్యుత్ బిల్లులపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు.

December 17, 2024 / 03:58 PM IST

మంత్రి లోకేశ్‌ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే

PLD: మంత్రి నారా లోకేశ్‌ను అమరావతిలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యల గురించి మంత్రికి వివరించారు. నరసరావుపేట దక్షిణం వైపు బైపాస్‌కు ప్రతిపాదించిన ఆప్షన్-3 వల్ల 5 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ -2ను అమలు చేయాలని మంత్రిని కోరారు.

December 17, 2024 / 03:54 PM IST

చెత్త రిక్షాలు పంపిణీ

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పారిశుధ్య కార్మికులకు చెత్త రిక్షాలు అందజేశారు. ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో 16 చెత్త రిక్షాలని పంపిణీ చేశారు. పట్టణాన్ని సుందరీకరించే భాగంలో చెత్త రిక్షాలను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

December 17, 2024 / 03:54 PM IST

మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న 24 మంది దినసరి కూలీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కోవిడ్ సమయంలో వీరి చేత సేవలు చేసుకొని ఇప్పుడు ఉద్యోగాలు కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

December 17, 2024 / 03:51 PM IST

గోపసాగరం కబ్జాను అరికట్టండి

PPM: పట్టణంలోని గోప సాగరం కబ్జాకు గురవుతోందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్వతీపురం రాయగడ రోడ్డులోని గోప సాగరాన్ని ఆ సమితి జిల్లా కార్యదర్శి చుక్క చంద్రరావుతో కలిసి పరిశీలించారు. సర్వే నెంబర్ 102లో గల సుమారు 32 ఎకరాల విస్తీర్ణం కలిగిన గోపసాగరం దాదాపు కబ్జాకు గురవుతోందన్నారు.

December 17, 2024 / 03:46 PM IST