• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాపట్లలో కిషోరి వికాసం కార్యక్రమంపై శిక్షణ

BPT: కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా బాపట్ల ఎంపీడీవో ఆఫీస్ నందు మంగళవారం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో ముఖ్యంగా కిషోరి బాలికల ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక సాధికారిత, బాలల హక్కులు చట్టాలపై ట్రైనర్ల ద్వారా అవగాహన కల్పించారు.

December 18, 2024 / 04:03 AM IST

నూతన పర్యాటక పాలసీ 2024-29 ఆవిష్కరణ

కృష్ణా: 2024-29 నూతన పర్యాటక పాలసీని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కొత్త పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో కొత్త పాలసీని విడుదల చేశారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారుల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

December 18, 2024 / 04:02 AM IST

నేడు వైసీపీ కార్యకర్తల సమావేశం

CTR: నగరిలో వైసీపీ కార్యకర్తల సమావేశం ఈరోజు మాజీ మంత్రి రోజా కార్యాలయంలో జరగనుందని ఆమె కార్యాలయం తెలిపింది. ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

December 18, 2024 / 04:01 AM IST

పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకి కృషి చేయాలి: DEO

GNTR: 10వ తరగతి విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కృషిచేయాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. చౌత్రా సెంటర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం సమ్మేటివ్ అసెస్మెంట్ టర్మ్-1 పరీక్షలను స్కూల్ ప్రధానోపాధ్యాయులు యం.డి ఖాసీంతో కలిసి డీఈవో పరిశీలించారు.

December 18, 2024 / 03:59 AM IST

‘గిరిజన రైతుల భూసమస్యలను పరిష్కరించాలి’

ASR: రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి మంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి మూడు జిల్లాల రెవెన్యూ సదస్సులో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. భూ సమస్యలతో అల్లూరి జిల్లాలో చాలా మంది గిరిజనులు సంక్షేమ పధకాలకు దూరమయ్యారని మంత్రికి తెలిపారు. కావున రెవెన్యూ సదస్సులకు వచ్చే గిరిజనుల వినతులను త్వరగా పరిష్కరించాలని కిడారి కోరారు.

December 17, 2024 / 08:39 PM IST

రెవెన్యూ సదస్సులకు 268 అర్జీలు

W.G: జిల్లాలో డిసెంబర్ 14న 24 గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించి 268 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆచంట, వేమవరం గ్రామాలలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్నా సదస్సులను వినియోగించుకోవాలన్నారు.

December 17, 2024 / 08:31 PM IST

ఓంకార ఆశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ నందు గల ఓంకార ఆశ్రమాన్ని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి మంగళవారం సందర్శించారు. అనంతరం కుసుమా విహార గీతా దేవి మందిరంలో 7 రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న భజనా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

December 17, 2024 / 08:25 PM IST

‘ఆర్‌డబ్ల్యూఎస్ పనులకు జడ్పీ నిధులు మంజూరు’

కృష్ణా: నియోజకవర్గంలో ఆర్‌డబ్ల్యూ‌ఎస్ పనులకు జడ్పీ నిధులు రూ.31 లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. వేకనూరులో 60 వేల లీటర్ల సంప్ నిర్మాణానికి రూ.12.50 లక్షలు, జయపురంలో మైక్రో మూలపాలెంలో 20 వేల లీటర్ల సంప్ నిర్మాణానికి రూ.ఆరు లక్షలు మంజూరు అయినట్లు వివరించారు.

December 17, 2024 / 08:25 PM IST

‘రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం’

TPT: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కోనేటి బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు.

December 17, 2024 / 08:23 PM IST

‘భూ సమస్యలను పరిష్కరిస్తాం’

ASR: రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని పాడేరు తహసీల్దార్ వీ.త్రినాధరావు అన్నారు. డీ.గొందూరు, కాడేలి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. భూ సమస్యలు, భూ సరిహద్దుల సమస్యలు, భూ ఆక్రమణలు, మ్యూటేషన్ల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

December 17, 2024 / 08:21 PM IST

‘శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలి’

అన్నమయ్య: కూటమి ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మదనపల్లెను ప్రకటించాలని జేఏసీ నాయకులు కోరారు. మంగళవారం బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు జిల్లా పేరు అంశాన్ని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

December 17, 2024 / 08:18 PM IST

సవరణకు 23 వరకు గడువు పెంపు

VZM: SSC మార్చి 2025 సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు హజరయ్యే విద్యార్ధులకు సంబంధించి గతంలో ఆన్‌లైన్‌లో ఏమైనా వివరాలు తప్పులుగా నమోదు చేసి ఉంటే సరిదిద్దుకోవచ్చుని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు మంగళవారం తెలిపారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేది, పుట్టుమచ్చల వివరాలు ఈ నెల 19 నుంచి 23వరకు సవరణకు స్కూల్ లాగిన్‌లో ఇవ్వడం జరిగిందన్నారు.

December 17, 2024 / 08:14 PM IST

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

KDP: రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 17, 2024 / 08:12 PM IST

‘మహిళా మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

GNTR: మహిళల సంరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ తీసుకువచ్చిన మహిళా మీకోసం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ ఎస్సై రాజ్యలక్ష్మి సూచించారు. తెనాలి గాంధీ చౌక్‌లో మంగళవారం మహిళా మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, ఆపదలో ఉన్న మహిళలు 112 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదిస్తే సహాయం అందజేస్తామన్నారు.

December 17, 2024 / 08:08 PM IST

డెంకాడలో ఆరుగురు పేకాటరాయళ్లు అరెస్ట్

VZM: డెంకాడ మండలంలోని ఢీ కొల్లాంలో పేకాట స్థావరంపై డెంకాడ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు రెక్కీ నిర్వహించగా.. గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 66,470 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఎస్సై తెలిపారు.

December 17, 2024 / 08:05 PM IST