• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు అరకు రానున్న ఒడిస్సా డిప్యూటీ సీఎం

VSP: ఒడిస్సా డిప్యూటీ సిఎం ప్రవతి పరిదా నేడు అరకులోయ వస్తున్నట్లు అల్లూరి జిల్లా అధికారులు తెలిపారు. ఆమె ఈరోజు ఉదయం 10.30 గంటలకు హెలీకాప్టర్‌లో అరకులోయ చేరుకుని హరితా రిసార్ట్స్‌కు వెళ్తారు. అక్కడ నుండి సుంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్‌ను, గిరి గ్రామదర్శిని, గిరిజన మ్యూజియంలను సందర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో ఒడిస్సాకు బయలుదేరుతారని తెలిపారు.

December 18, 2024 / 04:40 AM IST

సీఎం విజన్‌తో పరుగులెడుతున్న పోలవరం: కొమ్మాలపాటి

PLD: గత 5 ఏళ్లుగా రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్లక్ష్యాన్ని గురైనటువంటి పోలవరం ప్రాజెక్టు మరలా పరిగెడుతుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి రెండు కళ్లు వంటివని, గత 5 ఏళ్లలో వాటిని పూర్తిగా సర్వనాశనం చేశారని అన్నారు.

December 18, 2024 / 04:40 AM IST

మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: DMHO

ATP: మాతృ, శిశు మరణాలు అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.దేవి అన్నారు. నవంబర్ మాసంలో జిల్లాలో జరిగిన 5 మాతృమరణాలు, 5 శిశు మరణాలు జరగడానికి గల కారణాలపై స్థానిక డాక్టర్లు సిబ్బందితో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతృ శిశు మరణాలు నివారించాలని మండల స్థాయి అధికారులకు సూచించారు.

December 18, 2024 / 04:38 AM IST

భారత్-ఆర్మేనియా ప్రతినిధుల సమావేశంలో ఎంపీ

NDL: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన భారత్-ఆర్మేనియా దేశాల ద్వైపాక్షిక చర్చలకు హాజరయ్యే అవకాశం తనకు లభించినట్లు నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి హర్షం వ్యక్తం చేశారు. దౌత్య సంబంధాల బలోపేతం, వివిధ రంగాల్లో సహకారం, పరస్పర వృద్ధి, అభివృద్ధి అవకాశాలను అన్వేషించడంపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు ఎంపీ శబరి (X)లో పేర్కొన్నారు.

December 18, 2024 / 04:38 AM IST

వడ్డీ లేకుండా పన్ను చెల్లించండి: కమిషనర్

KDP: పన్నుల చెల్లింపుపై బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి కీలక ప్రకటన చేశారు. పట్టణ ప్రజలు ఈ నెలాఖరులోపు వడ్డీ లేకుండా పన్ను చెల్లించవచ్చని తెలిపారు. ఆయన పట్టణంలోని వివిధ కాలనీల్లో పర్యటించి పన్ను వసూలు చేశారు. మొండి బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. స్పందించకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

December 18, 2024 / 04:35 AM IST

వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్

NDL: వక్ఫ్ బోర్డు ఏర్పాటు ప్రక్రియను సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ వేగవంతంగా పూర్తి చేశారు. దీంతో వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్‌గా TDP నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు కొత్త సారధిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

December 18, 2024 / 04:35 AM IST

వాహన తనిఖీలు నిర్వహించిన సీఐ

PLD: నరసరావుపేట పట్టణంలో వాహన తనిఖీలను వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ మంగళవారం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు కచ్చితంగా నిబంధన ప్రకారం లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ వంటివి తీసుకోవాలన్నారు. త్రిబుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ రూట్లో ప్రయాణించటం నేరమన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. రూల్స్ పాటించి సహకరించాలని సీఐ విజయ్ చరణ్ కోరారు.

December 18, 2024 / 04:34 AM IST

మంత్రి బీసీ మరో కీలక నిర్ణయం

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు తనను కలిసేందుకు వచ్చేవారు నోట్ పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఇప్పటికే సూచించారు. ఇప్పుడు తాజాగా ఎలాంటి బ్యానర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఉండాలని, బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలాన్నారు.

December 18, 2024 / 04:33 AM IST

పోలీస్ స్టేషన్‌లో అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం పిలిపించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో రాఘవరెడ్డిని పిలిపించామని సీఐ నరసింహులు తెలిపారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

December 18, 2024 / 04:32 AM IST

‘భూ సమస్యలు పరిష్కరించేందుకే సదస్సులు’

GNTR: గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించటమే రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశమని రేపల్లె తహశీల్దార్ మోర్ల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం రేపల్లె మండలంలోని సింగుపాలెం, నల్లూరుపాలెం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఆన్ లైన్‌లో నమోదు చేసి పరిష్కారం చేస్తామన్నారు.

December 18, 2024 / 04:32 AM IST

సముద్రపు నీటి విద్యుత్ ఉత్పత్తిపై మాగుంట ప్రశ్న

ప్రకాశం: సముద్రపు నీటితో విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక సాధన, ఉపయోగం, అభివృద్ధికి కేటాయించిన నిధులు, విద్యుత్ ప్లాంట్ల వల్ల పర్యావరణ ప్రభావంపై.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి శ్రీపాద్ ఎస్సోనాయక్ సమాధానమిస్తూ.. సముద్ర నీటితో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని, ఇంతవరకు నిధులు కేటాయించలేదని చెప్పారు.

December 18, 2024 / 04:31 AM IST

నేటి నుండి ఫెన్సింగ్ పోటీలకు దరఖాస్తులు చేసుకోండి

SKLM: రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు బుధవారం నుండి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 21 నుంచి 23 వరకు విజయవాడలో జరగనున్నాయన్నారు. అంతర్జాలంలో నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను 76608 74844 నంబరును సంప్రదించాలని సూచించారు.

December 18, 2024 / 04:31 AM IST

ఉపాధి పనులను తనిఖీ చేసిన పీడీ

KDP: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని చింతకొమ్మదిన్నె, బుసిరెడ్డిపల్లె గ్రామపంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఆదిశేషారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులను నాణ్యతగా చేయాలని, సిమెంట్ రోడ్లు, పశువుల షెడ్లు త్వరగా నిర్మించాలని, ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని సిబ్బందిని ఆదేశించారు.

December 18, 2024 / 04:30 AM IST

కస్తూర్బా గాంధీ స్కూల్లో హ్యూమన్ రైట్స్ బృందం పర్యటన

సత్యసాయి: జగరాజుపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్‌ను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ధర్మవరం బృందం మంగళవారం సందర్శించారు. విద్యార్థినులతో చర్చించి, వారి విద్య, భోజన వసతి, హాస్టల్ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో IHRPC నేషనల్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ సుమలత, ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ రవివర్ధన్ తదితరులు పాల్గొన్నారు,

December 18, 2024 / 04:28 AM IST

సైబర్ నేరాలపై ప్రజలకు ఎస్సై అవగాహన 

KKD: పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో ఉన్న పార్క్ వద్ద మంగళవారం రాత్రి SI మణికుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్ చేసి మీ OTP నంబర్లు గానీ, బ్యాంకు వివరాలు అడిగితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

December 18, 2024 / 04:27 AM IST