VSP: జాయ్ జమీమియా (హనీ ట్రాప్) కేసులో మాజీ ఎంపీ కుమారుడు పాత్ర ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్బీ పేర్కొన్నారు. కమిషనరేట్లో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. జామ్ జమీమియా ముఠాలో మాజీ ఎంపీ కుమారుడు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. దీనిపై కూడా తాము విచారణ చేస్తున్నామన్నారు.
ATP: మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్ట్ పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్ కుమార్ను గుంతకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియాలో బ్రాహ్మణిపై అనుచిత పోస్ట్ పెట్టాడంటూ ఇటీవల స్థానిక టీడీపీ నేత ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి యువకుడికి నోటీసులు ఇచ్చారు.
ATP: గార్లదిన్నె మండలంలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ఏఈ విజయ్ కుమార్ తెలిపారు. కల్లూరు సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కణంపల్లి, ఇల్లూరు, ఎద్దులపల్లి, కల్లూరు గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
VSP: జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ అప్పలస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 19నుంచి 22వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 1 మిల్లీమీటరు నుంచి గరిష్టంగా 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు. రైతులు వరి పంట కోతలను, నూర్పులను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ప్రకాశం: దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల రైతులకు పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రమేష్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన పెరటి కోళ్లు, తేనెటీగలు, గొర్రెలు, మేకల పెంపకాలను చేపట్టాలని సూచించారు. అనంతరం పెరటికోళ్లను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు.
SKLM: టెక్కలి మండలం గూడెం గ్రామంలో మంగళవారం కోతుల సమూహం హల్చల్ చేసింది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో కోతులు గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. గూడెం గ్రామంతో పాటు గ్రామంలోని పంట పొలాల్లో కోతులు సంచరించడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
కృష్ణా: విజయవాడలో వ్యభిచార గృహంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. కొత్తపేట సీఐ కొండలరావు తెలిపిన వివరాలు మేరకు చిట్టినగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ ఘటనలో నిర్వాహకురాలు సరోజిని అలాగే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నమని పోలీసులు వెల్లడించారు.
ప్రకాశం: కొండను తవ్వి గ్రావెల్ తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం వద్ద విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్వుతుండగా గ్రామస్తులు తమ భూములు ఉన్నాయంటూ అడ్డుకున్నారు. పశువుల మేతకు ఈ కొండ జీవనాధారం అని అన్నారు. ఎవరైనా కొండ ప్రాంతంలో గల మట్టిని తరలిస్తే సహించేది లేదని ధర్నా చేశారు.
కృష్ణా: విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత హాజరవుతారని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం సూచించింది.
ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో జనవరి 8వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకూ చెంది ఉండి 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వుండే యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లాలో 2025 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలను సరిచేసుకునేందుకు డిసెంబర్ 19 నుంచి 23 వరకు అవకాశం ఉందని డీఈవో వెంకట లక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. సదరు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా అభ్యర్థుల పేరు, ఆధార్ చిరునామా, తదితర తప్పులను సరిచేయాలని సూచించారు.
W.G: కొవ్వూరులో డిసెంబర్ 21న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఈ మేళాకు 28 కంపెనీలలో 1,500 ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. జిల్లాలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో టవర్ వర్కుల కారణంగా బుధవారం ఉదయం 9.00 గంటల నుంచి 1.00 గంట వరకు టౌన్ – 3, ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పవిత్రా ఏరియా, గవర్నమెంటు హాస్పిటల్, పామూరు బస్ స్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
కృష్ణా: ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందింది. స్థానిక జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న పోలా గీతామాధురి (15) అనే విద్యార్థిని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి సాయంత్రానికి తండ్రి ఇంటికి వచ్చే సమయానికి విగత జీవిగా మంచంపై ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం: తండ్రీకొడుకు, భార్యాభర్త అనురాగం ఎంత గొప్పదో తెలిపే ఘటన ఇది. కట్టుకున్న వాడి కోసం కిడ్నీని, కన్నతండ్రి కోసం కాలేయాన్నే వదులుకున్న త్యాగమూర్తుల కథ ఇది. ఒంగోలుకు చెందిన రామారావు(54)కు కిడ్నీ, లివర్ ఫెయిల్ అయ్యాయి. కౌశిక్ లివర్లో కొంత భాగాన్ని రామారావుకు ఇవ్వడంతో హైదరాబాద్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.