TPT: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు తీసుకుని అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో రూ.50/100 చెల్లించి గదులు తీసుకుని, ఒక్కో గదిని రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గదిని పలువురికి ఇచ్చి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు.