• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైవీయూను సందర్శించిన ISO బృందం

KDP: యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(ISO) ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. మొదట ప్రతినిధుల బృందం హెచ్వైఎం ఇంటర్నేషనల్ సీఈవో ఆలపాటి శివయ్య, ఆడిటర్ సుమా దేవి.. వీసీ ఆచార్య కే కృష్ణారెడ్డిని కలిశారు. అనంతరం ప్రిన్సిపల్ ఎస్.రఘునాథ రెడ్డితో సమావేశమయ్యారు. పలు డిపార్ట్మెంట్లను పరిశీలించారు.

December 18, 2024 / 04:26 AM IST

నేడు కానాలలో ‘రెవెన్యూ సదస్సు’

NDL: సంజామల మండల పరిధిలోని కానాలలో బుధవారం ‘రెవెన్యూ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ పి.అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ సచివాలయంలో ఉ.10 గం నుంచి సా.5గం వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భూ యజమానులు ఏమైనా సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవచ్చని తహశీల్దార్ పిలుపునిచ్చారు.

December 18, 2024 / 04:26 AM IST

‘మహిళలు మనో ధైర్యాన్ని కలిగి ఉండాలి’

W.G: భీమవరం పట్టణంలోని ఎస్ ఆర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మిషన్ సాహిసి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ధైర్యాన్ని పెంపొందించుకుంటే పురుషులకన్నా అధికంగా అనుకున్నది సాధించగలరని అన్నారు.

December 18, 2024 / 04:26 AM IST

ఆ స్కూల్లో 172 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు

SKLM: హిరమండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు రెండు మొక్కలను నాటారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలో దాదాపు 172 మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నట్లు సైన్స్ ఉపాధ్యాయులు డొక్కర ధనుంజయ రావు తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని.. అందరి చేత నాటించాలన్నారు.

December 18, 2024 / 04:25 AM IST

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపేట: మంత్రి

కోనసీమ: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అయన మాట్లాడుతూ.. అన్నదాతను ఆదుకునేందుకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.43 వేల 42 కోట్లు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రామచంద్రపురం నీటి సంఘాల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి రైతులు ఏకగ్రీవం కావడం హర్షణీయమన్నారు.

December 18, 2024 / 04:25 AM IST

నేడు పాఠశాల భవన ప్రారంభోత్సవం

NDL: బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

December 18, 2024 / 04:24 AM IST

గంజాయి అక్రమ రవాణాపై నిఘా

SKLM: గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.

December 18, 2024 / 04:24 AM IST

‘ఈనెల 31 లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలి’

KDP: చింతకొమ్మదిన్నె మండలంలోని రసూల్ పల్లె, బుసిరెడ్డిపల్లె గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఈనెల 31వ తేదీ లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని అన్నారు. హార్టికల్చర్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ.. రైతులకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.

December 18, 2024 / 04:23 AM IST

డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

SKLM: బీఆర్ఆర్ వంశధార ప్రాజక్ట్ పరిధిలోని నౌపడ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. టెక్కలి వంశధార కార్యాలయం ఆవరణలో జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. కమిటీ అధ్యక్షుడిగా మల్ల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడుగా సగ్గు పోతయ్య రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వంశధార ఈఈ బీ. శేఖర్ రావు నియామక ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

December 18, 2024 / 04:23 AM IST

ఏలూరు జిల్లాలో “అభయ రక్షక మహిళా దళం గస్తీ

ఏలూరు జిల్లాలో “అభయ రక్షక మహిళా దళం మంగళవారం ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గస్తీ నిర్వహించారు. సందర్భంగా మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా గస్తీపై దృష్టి సారించారు. అలాగే స్కూల్ లు కాలేజీలు, పార్కు వద్ద పబ్లిక్ ప్రదేశాలు, బస్టాండ్లు వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

December 18, 2024 / 04:22 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన పయ్యావుల కేశవ్

ATP: ఏపీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చిన మంత్రి పయ్యావుల కేశవ్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను  మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించామని పయ్యావుల పేర్కొన్నారు.

December 18, 2024 / 04:21 AM IST

అనుమానాస్పదంగా మహిళ మృతి

అన్నమయ్య: బి.కొత్తకోట మండలంలో మంగళవారం మహిళా అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ జీవన్ తెలిపారు. గుమ్మసముద్రం పంచాయతీ, గుడ్లవారిపల్లికు చెందిన జనార్ధన్ భార్య దాసరి విజయనిర్మల(34) ఇంట్లోనే ఆపస్మారకస్థితిలో పడిఉండగా కుటుంబీకులు గమనించి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. డాక్టర్లు పరీక్షిస్తుండగా ఆమె మృతి చెందిందన్నారు.

December 18, 2024 / 04:20 AM IST

తెలంగాణ మద్యం పట్టివేత.. కారు సీజ్

ATP: తాడిపత్రి పట్టణంలో మంగళవారం అర్బన్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి వస్తున్న కారును తనిఖీ చేశారు. కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణకు చెందిన 48 మద్యం బాటిళ్లను పట్టుకొని కారును సీజ్ చేశారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న తెలంగాణకు చెందిన గోపిరెడ్డి, సుధాకర్, దస్తగిరి, నరసింహారావును అరెస్టు చేశారు.

December 18, 2024 / 04:19 AM IST

పైడికులముకు ప్రత్యేక క్యాటగిరీ కల్పించాలి

VZM: పైడికులమును ప్రత్యేక కేటగిరి కింద ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు రాయిడి శంకర్రావు కోరారు. దీనిపై మంగళవారం కలెక్టరేట్‌లో ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పైడి కులమును ప్రత్యేక కేటగిరీ కింద ఏర్పాటు చేసి 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని, గంగాధర్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

December 18, 2024 / 04:18 AM IST

నేటి నుండి డిపార్ట్మెంటల్ పరీక్షలు

W.G: APPSC నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు డిసెంబరు 18 నుంచి 23 వరకు జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. భీమవరం డీఎన్ఆర్ అటానమస్ విభాగంలో ఆరు రోజులపాటు పరీక్షలు జరగనున్నాయని, డిసెంబర్ 20 తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో, డిసెంబర్ 22 శ్రీవాసవి ఇంజినీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ పరీక్షలు జరుగుతాయన్నారు.

December 18, 2024 / 04:18 AM IST