• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు

KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి భవిత వికలాంగుల పాఠశాల నందు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ భాషా ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం పిల్లలందరికీ పండ్లు పంపిణీ చేశారు.

December 17, 2024 / 01:09 PM IST

మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలకు శుభవార్త

KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ నెలాఖరులోపు వడ్డీ లేకుండా అన్ని రకాల పన్నులు చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పన్ను బకాయిదారులు అన్ని సచివాలయాల్లో, యూపీఐ ద్వారా కూడా పనులను చెల్లించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

December 17, 2024 / 01:08 PM IST

డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌గా పుల్లంరాజు

W.G: పదవులు బాధ్యతలు మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌గా రుద్రరాజు పుల్లంరాజు, వైస్ ప్రెసిడెంట్ జక్కంపూడి సతీష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

December 17, 2024 / 01:04 PM IST

భూ సమస్యలు పరిష్కరించుకోవాలి: MLA

CTR: కార్వేటినగరం మండలం టీకేఎంపేట గ్రామంలో సచివాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ హాజరయ్యారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

December 17, 2024 / 01:04 PM IST

గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

PLD: నరసారావుపేటలో మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు కొనసాగుతున్నట్లు ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి తెలిపారు. మంగళవారం పాలపాడు, ములకలూరు గ్రామాలలోని సవాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులకు సంబంధించి నమోదు, చేర్పులు, మార్పులను పర్యవేక్షించారు. ఆయా గ్రామాల్లోని వారు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 17, 2024 / 01:03 PM IST

రెవెన్యూ సదస్సులపై అవగాహన ర్యాలీ

ATP: సింగనమల మండలం కల్లుమడి గ్రామంలో రెవెన్యూ సదస్సులపై మంగళవారం తహశీల్దార్ బ్రహ్మయ్య గ్రామ ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తహశీల్దార్.. గ్రామంలోని భూ సమస్యలపై రైతులు నుంచి అర్జీలను స్వీకరించారు. త్వరలోనే ఇచ్చిన అర్జీలను విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు తెలిపారు.

December 17, 2024 / 01:02 PM IST

వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం

VZM : షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. షెడ్యూల్డ్ కులాల వారీగా వారి సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ‌, విద్యా స్థితిగ‌తుల‌పై ఆరా తీశారు. పార్వతీపురం మన్యం జిల్లా గురించి కూడా సమీక్షించారు.

December 17, 2024 / 12:59 PM IST

రాష్ట్రపతికి పుష్పగుచ్చం అందజేసిన యార్లగడ్డ

కృష్ణా: మంగళగిరి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ, సీఎం పవన్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.

December 17, 2024 / 12:59 PM IST

నుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే

NLR: నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రమాణస్వీకారానికి సంబంధించి భారీ ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది. నగరంలోని స్థానిక నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహానికి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

December 17, 2024 / 12:55 PM IST

ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లోకల్ దుకాణ్ ఆన్‌లైన్ సర్వీసెస్‌ను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రారంభకులు బొద్దల సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లోనే ఇంటి అవసరాలకు ఉపయోగపడే అన్ని సర్వీసులు ఈ లోకల్ దుకాణ్ యాప్‌లో పొందుపరిచి ఉంటాయని ఆయన తెలియజేశారు.

December 17, 2024 / 12:55 PM IST

దుమ్ము, ధూళితో వాహనదారుల ఇక్కట్లు..!

PLD: మండల పరిధిలోని అనంతరం, దొడ్లేరు, ఆవులవారిపాలెం వెళ్లే ప్రయాణికులు దుమ్ము ధూళితో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు వేస్తున్న డబుల్ రోడ్డు పనులు జరగుతుండడంతో రోడ్డుపై దుమ్ము ధూళి అధికంగా లేస్తోందన్నారు. బస్సులు, లారీలు వెళ్లేటప్పుడు వచ్చే దుమ్ముతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

December 17, 2024 / 12:54 PM IST

సోమశిలలో 72.787 టీఎంసీల నీటిమట్టం నమోదు

NLR: నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 3,004 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.787 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

December 17, 2024 / 12:54 PM IST

అధైర్య పడొద్దు అండగా ఉంటాం: తిక్కారెడ్డి

KNL: కోసిగిలో ఇటివల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు నాడిగేని రంగన్న కుటుంబాన్ని మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

December 17, 2024 / 12:53 PM IST

అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వాణి మాట్లాడుతూ.. ఉదయం 8 గంటల నుంచి ఈ హుండీ లెక్కింపు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు సందర్భంగా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

December 17, 2024 / 12:52 PM IST

అధ్వానంగా బొబ్బిలిపేట రోడ్డు మార్గం

SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా తయారైంది. ఇటీవల సమీపంలో ఉన్న చెరువులో నుండి మట్టి తరలించడంతో టిప్పర్లు అధికంగా ప్రయాణించడంతో మరింత దారుణంగా తయారయిందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించడం కష్టంగా మారిందని వాపోతున్నారు.

December 17, 2024 / 12:50 PM IST