VSP: ప్రచురిత కథనం తమ ప్రతిష్ఠకు భంగం కలిగించిందంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ఓ దినపత్రికపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఐటీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చింతకాయల విజయ్ విశాఖ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపించారు.