NDL: అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని డిప్యూటీ ఎంపీడీవోలు మల్లికార్జున పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు స్వర్ణ పంచాయతీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం పంచాయతీ పరిధిలో 100% ఇంటి పన్నుల వసూలు, ఆదాయం మార్గాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.