BPT: సంతమాగులూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సాగునీటి సంఘం డీసీ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల్లో సంతమాగులూరు మండలం డీసీ అధ్యక్షుడిగా అడవి పాలెంకు చెందిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా ఏల్చూరు గ్రామానికి చెందిన నాసరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
కడప: శాశ్వత భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సరస్సులు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంబేపల్లి మండలం గుంటపల్లి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అధికారులు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 35వ వార్డులో మంగళవారం గుంతకల్లు గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ సమస్యల గురించి ఆరా తీశారు. మహిళలు వార్డుల్లో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
AKP: రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పాయకరావుపేట తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని పెంటకోట గ్రామంలో రెవెన్యూ ఏర్పాటు చేసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైతుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు.
VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి మంగళవారం బొబ్బిలి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల కాలంలో నూతనంగా వేసిన తాగునీరు పైపు లైన్లు పరిశీలించి, సక్రమంగా తాగునీరు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పక్కగా పారిశుధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: MP విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని సస్పెన్షన్కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉండవల్లిలో మంత్రి లోకేష్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. 2022-23లో తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి చేసి మగబిడ్డను కన్నారని ఆరోపించారు.
NLR: జి.అర్చిత నెల్లూరు నగరపాలక సంస్థలో ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఒంగోలు నగర పాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆమె సర్దుబాటుపై నెల్లూరు నగరపాలక సంస్థకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె కమిషనర్ సూర్య తేజను క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు.
ATP: రాప్తాడు మండలంలోని బండమీదపల్లి గ్రామంలో రూ.25లక్షల NREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం ప్రారంభించారు. అనంతరం గోకులం షెడ్లను కూడా ప్రారంభించి సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం బొమ్మరాజు చెరువులోని టీడీపీ పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులో ఉంటారు. నీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లు, ముఖ్య నాయుకులను కలుసుకొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ATP: కందుర్పి మండలం జంబుగుంపల గ్రామ పంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గ్రామంలోని భూ సమస్యలను తమకు తెలియజేయాలని కోరారు. వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. అనంతరం రైతులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.
సత్యసాయి: పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆరో తరగతి చదువుతున్న 13మంది బాలికలు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కోలుకున్న వారిని వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నారు.
CTR: జిల్లాలోని పీసీఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉపకరణాల నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ సంస్థ ALIMCO ద్వారా ఈ నెల 17 నుంచి 24వ తేది వరకు జిల్లాలో ఈ గుర్తింపు శిబిరాలు జరుగుతాయని తెలిపారు.
ELR: సూళ్లూరుపేట పట్టణంలోని హోలి క్రాస్ బైపాస్ జంక్షన్ వద్ద ఇటీవల ప్రమాదాలు ఎక్కువ కావడంతో స్థానిక SI బ్రహ్మ నాయుడు అద్వర్యంలో బ్యారికేట్లు ఏర్పాటు చేశారు,హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటుగా రోడ్ ప్రమాదాలు కూడా తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అంతేకాకుండా వాహనదారులు కూడా జాగ్రత్తగా వాహనం నడపాలని రాంగ్ రూట్లో నడిపితే చర్యలు తప్పవున్నారు.
GNTR: ఉండవల్లిలో మంగళవారం నిర్వహించిన మంత్రి లోకేష్ ప్రజాదర్బార్కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు మీకు అండగా ఉంటానంటూ లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. మంత్రి లోకేష్ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
SKLM: ఆమదాలవలస గాజులకొల్లివలస RRకాలనీకి చెందిన D. పద్మ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో సోమవారం నుంచి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో భవాని మాలలో ఉన్న నిందితుడు S. సురేష్ ను సన్నిధానం వద్ద మంగళవారం అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.