W.G: నల్లజర్ల మండలం దూబచర్లలో దొంగతనం జరిగింది. చీమకుర్తి భాస్కరరావు ఇంట్లోకి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు చొరబడి రూ.32 వేల నగదు, 40 గ్రాముల బంగారం దొంగిలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఏఎస్పీ సుబ్బరాజు, కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, సీఐ నక్క శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీకాకుళం: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట ఎం ఎస్ఎన్ పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం నర్సన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మామిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి నియోజకవర్గ నాయకులు బేరి వెంకటరమణ పలువురు పాల్గొన్నారు.
కృష్ణా: నేడు గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కర్నూలు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రానున్నట్లు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. అనంతరం వైసీపీ నాయకులతో సమావేశం అవుతారని సమాచారం.
VZM: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల 50వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ ముందుగా గజపతినగరంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సాధువులు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నేతలు బుచ్చిరాజు రవితేజ రాంబాబు కపిల్ పాల్గొన్నారు.
VZM: చెరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని బొబ్బిలి చెరకు రైతులు కోరుతున్నారు. NCS చక్కెర పరిశ్రమ మూతపడడంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరకును సంకిలి తరలిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. చెరకు కొనుగోలు చేయకపోవడంతో పొలంలో చెరకుఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SKLM: వీరఘట్టం పట్టణంలోని రెల్లి వీధిలో పారిశుద్ధ్య పనులపై అధికారులు శ్రద్ద పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడకక్కడ చెత్త పేరుకుపోవటంతో స్థానికులు ఆగ్రహిస్తున్నారు. బహిరంగంగా మల విసర్జన చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని మంగళవారం ఉదయం ఓ వ్యక్తి దుర్మరణంచెందాడు. ఈడేపల్లిలోని శ్రీపాద ఫంక్షన్ హాలు వద్ద బైక్పై వెళుతున్న వ్యక్తిని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మృతుడు గొడుగుపేటకు చెందిన కుంభం వరప్రసాద్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
VZM: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని 2వ స్థానం సాధించిన విజయనగరం జిల్లా మహిళా క్రీడాకారులను MLA అదితి అభినందించారు. ఆడ పిల్లలు అంటే వంటింటికే అనే సామెతను తిరగరాసి.. ఆడ పిల్లలంటే ప్రపంచాన్ని జయించింది అని నిరూపించారని వారిని అభినందించారు. మరెన్నో విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ASR: దారకొండలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో సీలేరు ఎస్సై రవీంద్ర తన సిబ్బందితో స్థావరంపై మంగళవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఆరుగరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.11,600, 8 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు.
NDL: సంజామల మండల కేంద్రంలో మంగళవారం ‘రెవెన్యూ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పి.అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ సచివాలయం ఆవరణంలో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భూ యజమానులు ఏమైనా సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్ పిలుపునిచ్చారు.
ప్రకాశం: దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, సర్పంచ్లకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్ల సుధారాణి, ఎంపీడీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు యావత్తు యంత్రాంగం కృషి చేయాలని చెప్పారు.
VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం బోడి కొండ చుట్టూ ఉన్న ప్రభుత్వ, దేవస్థానం భూములు ఆక్రమణకు గురయ్యాయి. బోడికొండ ఉత్తర భాగంలో భూములను కొంతమంది ఆక్రమించి మామిడి మొక్కలు వేయడంతోపాటు, ఇతర పంటలను సాగుచేస్తున్నారు. సోమవారం రామతీర్థంలో రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి రెవెన్యూ అధికారులకు ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.
AKP: ఎలమంచిలి పట్టణ రామ్మూర్తి నగర్లో గల రిటైర్డ్ ఎక్సైజ్ ఉద్యోగి బీవీ రమణ ఇంటిలో దొంగలు పడి రూ.4లక్షలు, 4 తులాల బంగారం దోచుకుపోయారు. ఇంటికి తాళాలు వేసి రమణ కుటుంబ సభ్యులు బళ్లారి వెళ్లారు. సోమవారం పనిమనిషి వచ్చి చూడగా తాళం తీసి ఉంది. రమణ ఇంటికి వెళ్లమనడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా నగదు, బంగారం పోయినట్లు గుర్తించారు. ఈమేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి విజయవాడ వాస్తవ్యులు తాడేపల్లిగూడెం వాస్తవ్వులు ఊటుకూరి నాగలవకుమార్ వారి కుటుంబసభ్యులు మంగళవారం రూ.50,116 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ ఈవో స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
KRNL: కర్నూలు జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు సమీపంలో ప్రమాదవశాత్తు ఆటోను లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.