• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుపతి దర్శనం ఇప్పిస్తానని డబ్బులు కాజేశారు

W.G: తిరుపతిలో విఐపి దర్శనం ఇప్పిస్తానని డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులను సోమవారం తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదుకు చెందిన గునిశెట్టి రాజకుమార్, వైట్ల సురేష్ కలిసి కలిశెట్టి సూర్యప్రకాష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి విఐపి దర్శనం ఇప్పిస్తానని రూ. 31 వేలు కాజేశారు. దీంతో అనుమానం వచ్చిన సూర్య ప్రకాష్ తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 17, 2024 / 08:48 AM IST

ప్రశాంతంగా పీసా ఎన్నికలు

SKLM: ఈ నెల 20 – 31వ తేదీలోపు పెసా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ITDA PO యశ్వంత్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఏజెన్సీలో 41 పంచాయతీల్లో 102 గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు గ్రామసభల్లో ఓటుహక్కు ఉన్నవారు పాల్గొని ఉపాధ్య క్షులు, కార్యదర్శులను ఎన్నుకోవాలని సూచిం చారు. ఎన్నికల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.

December 17, 2024 / 08:42 AM IST

పైడితల్లికి రాష్ట్ర సంఘంలో చోటు

SKLM: AP రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అకడమిక్ సెక్రటరీగా ఆమదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ డి.పైడితల్లి ఎన్నికయ్యారు. JCTA జిల్లా సెక్రటరీ డాక్టర్ ఎస్.రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి కార్యవర్గంలో జిల్లా నుంచి అకడమిక్ సెక్రటరీగా ఎన్నికవ్వడం గర్వించ దగ్గ విషయమన్నారు.

December 17, 2024 / 08:39 AM IST

పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రైతు ఎదురుచూపులు

ATP: హిందూపురం నుంచి మంగళగిరికి ఎద్దుల బండి యాత్ర చేపట్టిన యువరైతు నవీన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మూడు రోజులుగా ఎదురుచూస్తున్నారు. హిందూపురం మండలం శాసనకోట గ్రామానికి చెందిన ఆయన నెల రోజుల క్రితం యాత్ర ప్రారంభించి అనంతపురం, నంద్యాల జిల్లాల మీదుగా మంగళగిరికి చేరుకున్నారు.

December 17, 2024 / 08:30 AM IST

ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

కృష్ణా: తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని పెనమలూరు తాడిగడపకు చెందిన పెయింటర్ రాజేశ్ పోలీసులను ఆశ్రయించారు. భర్త కథనం.. భార్య జ్యోత్స్న విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈనెల 5న భార్య పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. తెలిసిన చోట్ల అంతా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేశామన్నారు.

December 17, 2024 / 08:23 AM IST

మారణాయుదాలతో వ్యక్తిపై దాడి

PLD: మాచర్ల మండలం పశువేములలో సోమవారం రాత్రి రమేష్ అనే వ్యక్తిపై దుండగులు మారణాయుదాలతో దాడి చేశారు. ఈ ఘటనలో రమేష్‌కు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై రమేష్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

December 17, 2024 / 08:21 AM IST

విశాఖ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ..!

VSP: యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని విజయనగరం SP వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పద్మనాభం మండలం పొట్నూరుకి చెందిన అప్పలనాయుడు విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీనిపై విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని 2020లో పోక్సో కేసు నమోదైంది. విచారణ చేపట్టగా నేరం రుజువయ్యిందన్నారు.

December 17, 2024 / 08:20 AM IST

కొండ దిగనున్న నెల్లిమర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

VZM: నెల్లిమర్ల పట్టణంలో రామతీర్థం జంక్షన్ సమీపంలోని కొండ పక్కనే అద్దె కొంపలో నడుస్తున్న. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మోక్షం లభించింది. పాత ఎంపీడీఓ కార్యాలయంలోకి మారనుంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొండదిగనుంది. పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం అసౌకర్యాలు నడుమ ప్రజలు అవస్థలు పడేవారు. ఇరుకు భవనంలో పట్టుమని పదిమంది కూర్చోడానికి కూడా స్థలం ఉండేది.

December 17, 2024 / 08:20 AM IST

సీఎంతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్

GNTR: సీఎం చంద్రబాబుతో రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.

December 17, 2024 / 08:18 AM IST

‘బాధిత కుటుంబానికి అండగా ఉంటా’

KDP: ఎర్రగుంట్ల మండలం థర్మల్ పవర్ ప్లాంట్లో కదిరివారిపల్లె గ్రామానికి చెందిన సందీప్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి థర్మల్ ప్లాంట్‌కు చేరుకొని బాధిత కుటంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్లాంట్ అధికారులతో మాట్లాడారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.

December 17, 2024 / 08:08 AM IST

విజయవాడలో రాష్ట్రపతి షెడ్యూల్ ఇదే

కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల అయింది. ఉదయం 11:30 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 12:05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌లో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరువుతారు. అలాగే 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు, నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరిస్తారు.

December 17, 2024 / 08:05 AM IST

‘రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి’

SKLM: వాహనదారులు రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జీ.మాడుగుల సీఐ బీ.శ్రీనివాసరావు, పెదబయలు ఎస్సై కే.రమణ సూచించారు. సోమవారం పెదబయలులో ఆటోలు, జీపులు ప్రైవేట్ వాహనదారులతో సమావేశం నిర్వహించారు. అతివేగం ప్రమాదమని, నిదానమే ప్రధానమని హితవు పలికారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించవద్దని స్పష్టం చేశారు.

December 17, 2024 / 08:03 AM IST

ఆత్మకూరులో నేడే మెగా జాబ్ మేళా

నెల్లూరు: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 17వ తేదీ మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జాబ్ మేళా కొనసాగనుందన్నారు. పూర్తి వివరాల కొసం 9182799405, 9701620305 ను సంప్రదించాలన్నారు.

December 17, 2024 / 08:03 AM IST

ముగ్ద మనోహరంగా వినాయకుడి దర్శనం

కోనసీమ: అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయకుడు సర్వాలంకార భూషితుడై ముగ్ద మనోహరంగా భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. పలు రకాల పుష్పాలతో స్వామివారికి విశేషాలంకరణ చేశారు. అర్చక స్వాములు స్వామివారికి మేలుకొలుపు సేవ ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిపించారు.

December 17, 2024 / 08:03 AM IST

మద్యం మత్తులో ఇంట్లోకి దూరిన యువకులు

అన్నమయ్య: మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడ్డ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని మదనపల్లె తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. ఆ మత్తులో బైక్‌ను నడపలేక పక్కనే ఉన్న కొత్తపల్లి శాంతిపురం కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డారని పేర్కొన్నారు. దీంతో స్థానికులు యువకులను తాళ్లతో బంధించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

December 17, 2024 / 08:01 AM IST