• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో జనసేనలోకి చేరికలు

ATP: పెనుకొండ నియోజకవర్గం నుంచి 50 మంది నాయకులు బుధవారం జనసేన పార్టీలో చేరారు. అనంతపురం సప్తగిరి సర్కిల్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీసీ. వరుణ్‌ వీమారిని పార్టీలోకి ఆహ్వానించారు. పవన్‌ కళ్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరుణ్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

November 26, 2025 / 05:00 PM IST

విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు

VSP: 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడించారు. రిలయన్స్-JV డిజిటల్ కనెక్షన్ ఏపీని ఎంచుకుందని వివరించారు. విశాఖను డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నామని తెలిపారు.

November 26, 2025 / 04:58 PM IST

‘అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తాం’

SKLM: అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. కవిటి మండలం రాజపురంలో ‘రైతన్న మీ కోసం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన ఇవాళ పాల్గొన్నారు. రైతుల ఇంటింటికి వెళ్లి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

November 26, 2025 / 04:54 PM IST

వీరులపాడులో పాస్టర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాం

NTR: వీరులపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాం దాచవరం గ్రామంలో బుధవారం తిమోతి చర్చిలో జరిగింది. మండల ప్రెసిడెంట్ మంద స్వామి దాసు మాట్లాడుతూ.. రానున్న క్రిస్టమస్ వేడుకలు ఘనంగా చెయ్యాలని పిలుపునిచ్చారు. పేదవారికి చేయూతనివ్వాలని అయన కోరారు. దైవ సేవకులు సమాజాని మంచి మార్గంలో ముందుకు నడిపిస్తూ.. తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు.

November 26, 2025 / 04:54 PM IST

కేడీసీసీ బ్యాంక్ వ్యవస్థాపకుల విగ్రహాలు ఆవిష్కరణ

కృష్ణా: గ్రామాల అభ్యున్నతి ద్వారానే దేశ అభ్యుదయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కేడీసీసీ బ్యాంకు ప్రాంగణంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, భూమి తనఖా బ్యాంక్ మాజీ అధ్యక్షుడు అడుసుమిల్లి అశ్వర్ధ నారాయణమూర్తి కాంస్య విగ్రహలను ఛైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

November 26, 2025 / 04:53 PM IST

బాపట్ల మండల అధికారిగా శ్రీరాములు

BPT: ఈస్ట్ బాపట్ల పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములుకు పదోన్నతి లభించింది. ఆయనను డిప్యూటీ ఎంపీడీవోగా, డెప్యుటేషన్‌పై మండల సచివాలయాల శాఖ అధికారిగా కలెక్టర్ నియమించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన బాపట్ల ఎంపీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంపీడీవో బాబురావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

November 26, 2025 / 04:44 PM IST

జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

KRNL:భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 76 సంవత్సరాలు పూర్తిఅయింది. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ చిత్రపటానికి కర్నూలు ASP జి. హుస్సేన్ పీరా, AR ASP కృష్ణ మోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు.

November 26, 2025 / 04:42 PM IST

‘జగన్ వ్యవసాయ రంగాన్ని ఐదేళ్లు నాశనం చేశాడు’

NTR: జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని ఐదేళ్లు నాశనం చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గొల్లపూడిలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. పంచసూత్రాల ఆధారంగా సాగును పటిష్టం చేసే చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. రసాయన రహిత పద్ధతులతో పంట దిగుబడిని పెంచుకోవచ్చు అన్న విషయాన్ని తమ అనుభవాలతో వెల్లడించారు.

November 26, 2025 / 04:41 PM IST

పుష్కరాలపై అధికారులతో కలెక్టర్ సమావేశం

E.G: రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారుల అధికారులు, ఎమ్మెల్యేలు ఎంపీతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సమావేశం అయ్యారు. 2027 పుష్కరాలకు సంబంధించి అంశాలపై వారు చర్చించారు. జాతీయ రహదారులను పుష్కరాలకు ముందే అభివృద్ధి చేయాలని రోడ్లు నిర్మాణ పనులతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.

November 26, 2025 / 04:40 PM IST

కొత్తమ్మ తల్లి ధర్మ హుండీ ఆదాయం ఎంతంటే..?

SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ధర్మ హుండీ ఆదాయం రూ.6.91లక్షలు లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాచర్ల రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ ఛైర్మన్ కోరాడ గోవిందరావు, పాలకమండలి, సోంపేట ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, పోలీస్ సిబ్బంది భక్తులు ఆధ్వర్యంలో లెక్కించినట్లు పేర్కొన్నారు.

November 26, 2025 / 04:40 PM IST

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్

ATP: రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను కలెక్టర్ ఆనంద్ అందజేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారికి పలు అమూల్యమైన సూచనలను చేశారు. మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

November 26, 2025 / 04:40 PM IST

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

AKP: సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరూ రాజ్యాంగానికి బద్ధులై నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, పంచకర్ల రమేష్ బాబు, ఎస్పీ తుహీన్ సిన్హా విద్యార్థినులకు 426 సైకిళ్లు పంపిణీ చేశారు. బాలికలు బాగా చదువుకుని ఉన్నత విద్యావంతులు కావాలని సూచించారు.

November 26, 2025 / 04:37 PM IST

గిరిజనులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

NLR: సామాజికంగా వెనుకబడి వున్న గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటు పడతానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఏఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు 500 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

November 26, 2025 / 04:36 PM IST

పాలకోడేరులో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

W.G: పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి అరుగుపై కూర్చుని ముఖాముఖిగా పాల్గొని వారి బాధలను, వరి పంట సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.

November 26, 2025 / 04:36 PM IST

భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి షష్టి

NDL: నంద్యాల పట్టణంలోని నాగులకుంట రోడ్డులోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టిని ఇవాళ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, ఎండు ఫలాలతో అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు చేశారు.

November 26, 2025 / 04:35 PM IST