• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పులివెందులలో రేపటి నుంచి ఆధార్ క్యాంపులు

కడప: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాల్లో ఈనెల 19వ తేదీ నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న ప్రశాంతినగర్, మున్సిపల్ మాస్టర్ క్యాంపు, 19న పెద్ద కొండప్ప కాలనీ, భాకరాపురం, 20న ఉలిమెల్ల, రాజీవ్ కాలనీ సచివాలయాల ప్రాంతాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

December 17, 2024 / 12:50 PM IST

‘కూటమి ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం’

ELR: కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధికి సంబంధించిన రూ.27,11,511 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ.75లక్షలను బాధితులకు అందజేశామన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు ఉన్నారు.

December 17, 2024 / 12:48 PM IST

రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సీఎం, డిప్యూటీ సీఎం

GNTR: మంగళగిరిలోని ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

December 17, 2024 / 12:46 PM IST

లింగాలలో ఘనంగా వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు

కడప: లింగాల మండలం ఇప్పట్లలో ఉన్న లీలావతి చారిటబుల్ ట్రస్టులో మంగళవారం పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు వృద్ధుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధృవకుమార్ రెడ్డి వైఎస్ షర్మిల జన్మదిన కేకును కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

December 17, 2024 / 12:45 PM IST

అలువాల గ్రామంలో రెవెన్యూ సదస్సు

కర్నూలు: గోనెగండ్ల మండల పరిధిలోని అలువాల గ్రామంలో రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల ఎదుర్కొంటున్న భూ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భూసమస్యలతో పాటు, ఇనాం భూములు, దేవదాయ, అసైన్డ్ భూముల సమస్యలు ఉంటే అర్జీలు సమర్పించవచ్చన్నారు.

December 17, 2024 / 12:43 PM IST

అనగానిని కలిసిన పంతాని, యరగళ్ల

BPT: నీటి సంఘాల ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు లేకుండా కూటమి బలపరిచిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం సాగునీటి సహకార సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు పంతాని మురళీధరరావు, యరగళ్ళ శ్రీనివాసరావులు ఆయనకు కలిశారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన చైర్మన్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.

December 17, 2024 / 12:36 PM IST

అనగానిని కలిసిన పంతాని, యరగళ్ల

BPT: నీటి సంఘాల ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు లేకుండా కూటమి బలపరిచిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం సాగునీటి సహకార సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు పంతాని మురళీధరరావు, యరగళ్ళ శ్రీనివాసరావులు ఆయనకు కలిశారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన చైర్మన్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.

December 17, 2024 / 12:36 PM IST

ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

CTR: ఏస్ఆర్ పురం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాల పంపిణీలో అర్హులైన వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేస్తున్న ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం తెలిపారు. అధికారులు ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.

December 17, 2024 / 12:34 PM IST

గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

E.G: మారేడుమిల్లి మండలంలోని మారేడుమిల్లి-పూజారిపాకలు రోడ్డుకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమయంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే అన్నారు.

December 17, 2024 / 12:33 PM IST

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా శిక్షణా తరగతులు

GNTR: గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు నరసారావుపేట ఎంపీడీవో టీ.వీ కృష్ణకుమారి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పంచాయతీ సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ తరగతులను రెండో రోజు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోనూ తాగునీరు, పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు.

December 17, 2024 / 12:31 PM IST

రేపు అమలాపురం రానున్న మంత్రి అచ్చెన్న

కోనసీమ: అమలాపురంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు అమలాపురంలోని కాపు కళ్యాణ మందిరంలో అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే డీడీఆర్సీ సమావేశానికి హాజరవుతారని తెలిపారు.

December 17, 2024 / 12:31 PM IST

రాజోలు నీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్‌గా బుజ్జి

కోనసీమ: రాజోలు నీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్,  వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం రాజోలు ఎంపీడీవో కార్యాలయం నందు తహశీల్దార్ ప్రసాద పర్యవేక్షణలో జరిగింది. చైర్మన్‌గా శివకోడు గ్రామానికి చెందిన పినిశెట్టి బుజ్జి, వైస్ చైర్మన్‌గా గొంది గ్రామానికి చెందిన నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని ఘనంగా సత్కరించారు.

December 17, 2024 / 12:30 PM IST

బాలిరెడ్డిపాలెంలో ప్రత్యేక పూజలు

NRL: నెల్లూరు జిల్లా, వాకాడు మండలం, బాలిరెడ్డి పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో మంగళవారం ధనుర్మాస సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా మాజీ సొసైటీ ఛైర్మన్ కొడవలూరు దామోదరరెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

December 17, 2024 / 12:26 PM IST

‘అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రత’

ASR: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అరకులోయ మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జీ.మాడుగుల 6.2, గూడెం కొత్తవీధి 7.2, హుకుంపేట 7.4, చింతపల్లి 7.5, ముంచంగిపుట్టు, పెదబయలు 9.7, అనంతగిరి 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందన్నారు.

December 17, 2024 / 12:25 PM IST

కుప్పంలో తీరు మారని ఆర్టీసీ

CTR: ప్రభుత్వం మారినా ఆర్టీసీ తీరు మారడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల పనితీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. చిత్తూరు-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కుప్పం బస్టాండ్ వద్ద స్టార్ట్ కాక మొరాయించడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సును ముందుకు నెట్టారు.

December 17, 2024 / 12:25 PM IST