BPT: రేపల్లె ఆర్టీసీ డిపోను ఆర్టీసీ హౌస్ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.అప్పలరాజు శనివారం సందర్శించారు. అయనతో పాటు గుంటూరు డీపీటీవో ఎం.రవికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సమయపాలనపై మాట్లాడారు. దూరప్రాంతం వెళ్లు బస్సులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, మధ్యలో ఉండే పికప్ పాయింటులో కొద్దిసేపు ఆపుకొని వెళ్ళుటకు అవకాశం ఉంటుందన్నారు.
PPM: మన్యం జిల్లాలో అరటి, జీడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించటానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రాసెసింగ్ యూనిట్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీడి, మామిడి పంట అధికంగా ఉందని తద్వారా ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి అదిక ఆదాయం పోందవచ్చన్నారు.
ELR: సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచని ఏలూరు రైల్వే స్టేషన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో నూతన శోభను సంతరించుకొనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ ఇటీవల కోరడం జరిగింది. దీంతో అమృత్ భారత్ పథకం కింద రూ. 21 కోట్లను కేంద్రం మంజూరు చేయడంతో రైల్వే స్టేషన్లో శరవేగంగా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.
KKD: కుడా ఛైర్మన్గా తుమ్మల బాబు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని శనివారం పెద్దాపురం జనసేన కార్యాలయం తెలిపింది. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ (కుడా) ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొనున్నారు.
SKLM : జాతీయ పింఛనదారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ఆమదాలవలస పట్టణంలో ఏర్పాటు చేయనున్న పింఛన్దారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని విశ్రాంతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు సురవరపు సిమ్మినాయుడు అన్నారు. ఈ సమావేశంలో పింఛన్దారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
GNTR: కుంచనపల్లి హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం సందర్శించారు. లక్ష్మీ నరసింహస్వామి హోమంలో పాల్గొన్నారు. అనంతరం రాధా కృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇస్కాన్ ప్రతినిధుల ఆశీర్వచనాలు అందుకున్నారు. చివరిగా భక్తులకు భగవద్గీత పుస్తకాలను ఎమ్మెల్యే మాధవి పంపిణీ చేశారు.
KDP: వీరపునాయునిపల్లె మండలం పాలగిరి క్రాస్ వద్ద వెలసిన సద్గురు కాశీనాయన స్వామి ఆలయం వద్ద ఆదివారం బండలాగుడు పోటీలను నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి న్యూ కేటగిరి రాష్ట్ర స్థాయి విభాగంలో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చీటీలు ఇవ్వడం జరుగుతుందని ప్రవేశానికి 500 రూపాయలు అన్నారు.
ELR: విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని శనివారపుపేట జడ్పీ హైస్కూల్ 40 వసంతాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
E.G: రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 16న యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. కావున జిల్లా ప్రజలందరూ గమనించాలని కలెక్టర్ సూచించారు.
GNTR: వ్యక్తి అదృశ్యంపై గుంటూరు పట్టణంలోని లాలాపేట పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేట రొట్టెల బజారుకు చెందిన పులుగుమూటు శంకర్రావు అనే వ్యక్తి వేరుశనగలు విక్రయిస్తూ జీవిస్తున్నాడని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శంకర్రావు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఈ నెల 12న ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని అన్నారు.
PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెంటచింతల మండలం మంచికల్లులో తన తండ్రి యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. తొలుత ఎమ్మెల్యే.. కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావులతో కలసి గురజాల పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలిస్తారు.
W.G: పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 ఏళ్లకు ఒకసారి సేవ్ ది గర్ల్ చైల్డ్ అంశంపై 2కే రన్ నిర్వహిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరిగే కార్యక్రమానికి మంత్రి అనిత, కలెక్టర్ నాగరాణి, ఏపీ టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి, సినీ గాయని మధుప్రియ హాజరవుతారన్నారు.
GNTR: జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ఆధ్వర్యంలో న్యాయసేవాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ అదాలత్లో 2,759 కేసులు పరిష్కరించినట్లు పార్థసారథి తెలిపారు. సివిల్ 258, క్రిమినల్ 1,898, చెక్ బౌన్స్194, కార్మిక 7, వివాహ 64, బ్యాంకు 56, ప్రీ-లిటిగేషన్129 పరిష్కారమయ్యాయి అని పేర్కొన్నారు.
KDP: ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రాలు, కరపత్రాలను శనివారం తన క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు. ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
VZM: మున్సిపల్ కమిషనర్ పి. నల్లనయ్య శనివారం స్దానిక మేదరవీధిలో పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న వాహనాలను పరిశీలించారు.అక్కడ మరమ్మతులకు గురైన వాహనాలు ఎక్కువగా ఉండడానికి గమనించి వాటిని సరిచేసేందుకు ప్రత్యేకమైన మెకానిక్ను ఏర్పాటు చేసి, వెళ్డింగ్ యంత్రం, ఇతర యంత్రాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.