NLR: నెల్లూరు జిల్లాలో పదివేల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని వేమిరెడ్డి నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో జిల్లాలో నిరుద్యోగ సమస్య లేకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తామన్నారు.
NLR: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కానుగ చెట్టు ఆకుపై వారి చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ.పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఆయన పలు ముఖ్యమైన సందర్భాల్లో ప్రముఖుల చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసే అభిరుచి ఉంది. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని గీశారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక గ్రోత్ సెంటర్ సమీపంలో సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించిన లోడ్ విశాఖ నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రెండు సిలికా మాంగనీస్ లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఒక్కో లారీకి రూ. 30 వేలు చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు.
NLR: నెల్లూరు నగరం 33/11 కె.వి ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ ఫీడర్ వద్ద చెట్ల కొమ్మలు తొలగించుటకు ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నెల్లూరు టౌన్ డివిజన్ ఈఈ ఎం శ్రీధర్ తెలిపారు. ఆటోనగర్ పరిసర ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.
ATP: ఆరు నెలల పాటు కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ ఇప్పుడు బయటకొచ్చి కీస్ కీస్ మంటున్నాయంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేపట్టిన రైతు పోరుబాటపై ఆమె తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. అసలు వైసీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా.. అని నిలదీశారు.
ASR: కొయ్యూరు మండలానికి రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని ట్రైబల్ వెల్ఫేర్ జేఈ శ్రీవిద్య తెలిపారు. యూ. చీడిపాలెం, కంఠారం పీహెచ్సీలకు రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే యూ.చీడిపాలెం పీహెచ్సీలో భవన నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. సంరక్షణ కేంద్రాల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
NDL: బేతంచెర్ల మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో శనివారం జరిగిన సాగునీటి సంగం ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో రైతులు, అధికారులు, పోలీసులకు ఎన్నికల అధికారి ఫజుల్ రహిమాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం చైర్మన్ లింగాల పద్మనాభుడు, వైస్ చైర్మన్ పెద్ది సావిత్రిలకు డిక్లరేషన్ ఫారం అందజేసి అభినందనలు తెలిపారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలో బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా బైక్ రైడింగ్ యువకులకు జిల్లా ఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం సాయంత్రం హైవేలో రైడింగ్ చేస్తున్న 30 మంది యువకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. రైడింగ్ చేయడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా జిల్లా ఎస్పీ రత్న యువకులకు కౌన్సెలింగ్ చేపట్టారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలో 27 చెరువులు, 5 సాగునీటి వినియోగదారుల సంఘాలు మొత్తం 32 సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై MLA పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తాజాగా ఎన్నికైన మెంబర్లు తమకు వచ్చినవి పదవులుగా భావించవద్దని అవి బాధ్యతలన్నది మర్చిపోవద్దు అని తెలిపారు.
సత్యసాయి: శ్రీ వివేకానంద స్పోర్ట్స్ సొసైటీ, ఆర్డీటీ సహకారంతో ధర్మవరం క్రీడాకారులు నవ్య, ఉష శనివారం గుంతకల్లు రైల్వే క్రీడామైదానంలో జరిగిన జిల్లా స్థాయి జూనియర్స్ కబడ్డీ పోటీలలో రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికయ్యారు. డిసెంబర్ 22-25 మధ్య ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ATP: బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు సాగునీటి సంఘం అధ్యక్షులు రాచమల్లు సోమశేఖర్, ఉపాధ్యక్షులు బుసగాని ఆదినారాయణ, డైరెక్టర్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
SKLM: పొందురు మండలం పిల్లలవలస గ్రామానికి చెందిన గురుగుబెల్లి హేమలత శనివారం విడుదలైన ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో BSF జవాన్గా ఎంపికయ్యారు. డిగ్రీ శ్రీకాకుళంలో ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశారు. తండ్రి గురుగుబెల్లి శ్రీరామమూర్తి, తన భర్త బూర్జ సూరపు చంద్రశేఖర్, ట్రైనింగ్ కోచ్ తేజ ప్రోత్సాహంతో ఈ ఉద్యోగం సాధించినట్లు ఆమె తెలిపారు.
NLR: రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్లడానికి ఒక వాగును దాటే నీళ్లు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల వైపు మండల విద్యాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వల్ల దోమలు చేరి విద్యార్థులు విష జ్వరాలకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల...
ATP: గుత్తి పట్టణంలోని ఏడీజే, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ అన్ని రకాల కేసులు కలిపి మొత్తం 530 కేసులను పరిష్కరించమని తెలిపారు.
ATP: పామిడి మండలం జి కొట్టాల గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పామిడి ఎస్సై సుధాకర్ యాదవ్ శనివారం తన సొంత ఖర్చుతో 5 ట్రాక్టర్ల గడ్డివామును రైతుకు అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ.. ఓ రైతు ఆవేదనను అర్థం చేసుకునీ రైతుకు సొంత ఖర్చులతో రూ.లక్ష 50 వేల గడ్డివామును అందజేశామన్నారు.