PLD: రాజ్యాంగంపై చర్చలో నరసరావుపేట టీడీపీ పార్లమెంటరీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శనివారం లోక్ సభలో మాట్లాడారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు తమ పార్టీ మొదటి నుంచి మద్దతు తెలుపుతుందని, ఇందులోనే స్థానిక సంస్థల ఎన్నికలను చేర్చాలని కోరారు. రాజ్యాంగ స్పూర్తితో తమ పార్టీ పనిచేస్తుందని, ప్రజాస్వామ్యయుత విధానాలకు మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
W.G: జిల్లాలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలలో 113 సంఘాలు ఏకగ్రీవం అయినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 17న 6 నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికల నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
KKD: జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిర్వహణ జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం రాత్రి తెలిపారు. జిల్లాలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నీటి సంఘం ఎన్నికలను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించేందుకు కృషి చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
PPM: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అడ్డాపుశీల గ్రామంలో శనివారం గిరి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, ఉత్పాహం సొంతం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ జయ రామ అంటూ గిరి ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
KKD: ప్రజలను ఎలా మభ్య పెట్టాలో తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఆలోచించకుండా విజన్- 2047 అంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ELR: భీమడోలు మండలం గుండుగొలను వద్ద నిర్మితమవుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
SKLM: శ్రీకాకుళం నగరంలో పి.ఎన్.కాలనీలోని నారాయణ తిరుమలలో ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు జి. శ్రీనివాసులు, ఈవో పి.శ్యామలరావు తెలిపారు. ఈనెల 16 తేదీ నుంచి జనవరి 14 వరకు తిరుప్పావై కార్యక్రమం, విశేష అర్చన పూజలు ఉంటాయన్నారు. జనవరి 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం ఉంటుందన్నారు. భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
KDP: డిసెంబర్ 19న ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కడపలో కరపత్రాలు విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ విభాగాల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.
KDP: జిల్లాలోనే అతి పెద్ద చెరువు ఒంటిమిట్ట చెరువు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం ఒంటిమిట్ట హరిత హోటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి ఒంటిమిట్ట చెరువు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభపరిణామమని అన్నారు.
E.G: రాజమహేంద్రవరంలో ఆదివారం మహాదున్ను సభను నిర్వహిస్తామని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరంలోని లాలాచెరువు వద్ద మహాదన్ను సభను పురస్కరించుకొని దివంగత నాయకుడు దొమ్మేటి వెంకట్రెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
BPT: రేపల్లె ఆర్టీసీ డిపోను ఆర్టీసీ హౌస్ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.అప్పలరాజు శనివారం సందర్శించారు. అయనతో పాటు గుంటూరు డీపీటీవో ఎం.రవికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సమయపాలనపై మాట్లాడారు. దూరప్రాంతం వెళ్లు బస్సులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, మధ్యలో ఉండే పికప్ పాయింటులో కొద్దిసేపు ఆపుకొని వెళ్ళుటకు అవకాశం ఉంటుందన్నారు.
PPM: మన్యం జిల్లాలో అరటి, జీడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించటానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రాసెసింగ్ యూనిట్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీడి, మామిడి పంట అధికంగా ఉందని తద్వారా ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి అదిక ఆదాయం పోందవచ్చన్నారు.
ELR: సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచని ఏలూరు రైల్వే స్టేషన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో నూతన శోభను సంతరించుకొనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ ఇటీవల కోరడం జరిగింది. దీంతో అమృత్ భారత్ పథకం కింద రూ. 21 కోట్లను కేంద్రం మంజూరు చేయడంతో రైల్వే స్టేషన్లో శరవేగంగా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.
KKD: కుడా ఛైర్మన్గా తుమ్మల బాబు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని శనివారం పెద్దాపురం జనసేన కార్యాలయం తెలిపింది. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ (కుడా) ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొనున్నారు.
SKLM : జాతీయ పింఛనదారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ఆమదాలవలస పట్టణంలో ఏర్పాటు చేయనున్న పింఛన్దారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని విశ్రాంతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు సురవరపు సిమ్మినాయుడు అన్నారు. ఈ సమావేశంలో పింఛన్దారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.