• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రంజాన్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి’

ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.

February 19, 2026 / 07:07 AM IST

అక్రమంగా తరలిస్తున్న డీజిల్, పెట్రోల్ స్వాధీనం

కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద యానాం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 790 లీటర్ల డీజిల్, 80 లీటర్ల పెట్రోల్‌ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 19, 2026 / 06:51 AM IST

ఈ నెల 22 న రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: ఈ నెల 22న రామచంద్రపురం ఉపాధి భవన్లో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 18 నుంచి 27 ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఐటిఐ చదివిన అభ్యర్థులకు రూ.18 వేల జీతంతో షిఫ్ట్ టైంలో భోజన, రవాణా సదుపాయం కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.

February 19, 2026 / 05:20 AM IST

రేపే చత్రపతి శివాజీ శోభాయాత్ర

CTR: పలమనేరులో ఈనెల 19వ తేదీన ఛత్రపతి శివాజీ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్ర పలమనేరు లయన్స్ క్లబ్ నుంచి ప్రారంభమై, రెక్కమాను సర్కిల్, జిలాని సర్కిల్, పెట్రోల్ బంక్, యంబీటి రోడ్డు, జవిలి వీధి మీదుగా తిరిగి లయన్స్ క్లబ్ వద్దకు చేరుకుంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

February 18, 2026 / 08:09 PM IST

తెనాలిలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన

GNTR: కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. బుర్రిపాలెంలోని టిడ్కో లేఔట్‌ను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న 2,880 ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంతో పాటు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.

February 18, 2026 / 07:40 PM IST

కొవ్వూరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరిక

E.G: కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, 3, 5, 19, 20వ వార్డు YCP కౌన్సిలర్లు బుధవారం టీడీపీలోకి చేరారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి రాష్ట్ర TDP అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

February 18, 2026 / 07:36 PM IST

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ మండల కన్వినర్ నరేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధానం చేయాలన్నారు.

February 18, 2026 / 07:35 PM IST

అప్రోచ్ రోడ్డుకు రూ.30 లక్షలు నిధులు మంజూరు

కోనసీమ: ఆలమూరు(మం) లంక గ్రామాలకు ఎంతో ప్రయోజనకరమైన చెముడులంక వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ నిధులను మంజూరు చేయించారు. ఏటిగట్టు అవతల ఉన్న బడుగువానిలంక గ్రామ ప్రజలతో పాటు, చెముడులంక, మడికి, పొట్టిలంక తదితర రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

February 18, 2026 / 07:35 PM IST

టిఫిన్ సెంటర్లపై అధికారుల దాడులు

VZM: పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై పౌర సరఫరా అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్వో మురళీనాధ్ తెలిపారు. ఏడు చోట్ల తనిఖీలు జరిపి 6-ఏ కేసులు నమోదు చేశామని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 18, 2026 / 07:30 PM IST

‘విద్యార్థులు ఎక్కువగా విద్యపైన దృష్టి కేంద్రీకరించాలి’

CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, రోడ్డు భద్రత, ధైర్య స్పర్శ చొరవపై దృష్టి సారించాయి. సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి క్రమశిక్షణ లక్షణాలు కలిగి ఉండాలన్నారు.

February 18, 2026 / 07:27 PM IST

రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని రికార్డులను డీఐజీ పరిశీలించి,రికార్డు నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని, కేసుల పరిష్కారంలో జాప్షం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ ధీరజ్ వినిల్, పాల్గొన్నారు.

February 18, 2026 / 07:24 PM IST

జనన, మరణాల నమోదుపై కొత్త రూల్స్: కమిషనర్

GNTR: రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుపై జీవోఎంఎస్ 28 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. జనన లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ 21 రోజులు దాటితే, రూ. 25 అపరాధ రుసుముతో 30 రోజులలోపు నమోదు చేసుకోవచ్చని వివరించారు.

February 18, 2026 / 07:20 PM IST

చీమకుర్తిలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: చీమకుర్తిలో తూర్పు బైపాస్ రోడ్డు కూడలి నందు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ మీద వెళుతున్న రాజేశ్, కోటయ్యలను ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు బాగా దెబ్బ తినటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

February 18, 2026 / 07:58 PM IST

ఈ నెల 22న బాపట్ల జిల్లా టీడీపీ ఆఫీస్‌కు శంకుస్థాపన

బాపట్లలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బుధవారం వెల్లడించారు. ఇదే వేదికపై బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజశేఖర్ బాబు ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఈ రెండు కీలక కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

February 18, 2026 / 07:04 PM IST

రేపు వేల్పూరులో వైఎస్ షర్మిల పర్యటన

PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.

February 18, 2026 / 07:01 PM IST