ప్రకాశం: కొనకనమిట్ల మండలం గాజులపల్లికి చెందిన సుమారు 50 వైసీపీ కుటుంబాలు నిన్న టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సాని కొమ్ము రవీంద్రారెడ్డి, వెంకటయ్య ఆధ్వర్యంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.
SKLM: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ మేరకు మొత్తం రూ.88,70,216 ఆదాయం లభించినట్లు ఆలయం ఈవో ప్రసాదరావు తెలిపారు. అదే విధంగా భక్తుల నుంచి 20 గ్రాముల బంగారం, కేజీ 700 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయన్నారు. ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.
W.G: తాడేపల్లిగూడెంలో నెలవారి సేవాకార్యక్రమాల్లో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈతకోట తాతాజీ పేదలకు కిరాణా కూరగాయలు ఇవాళ ఉదయం పంపిణీ చేశారు. పేదలు వంటచేసుకునేందుకు వీలుగా ఉదయం వీటిని అందచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఛాంబర్ నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి ACB అదనపు ఎస్పీ విమల కుమారికి రిటైర్మెంట్ ముందు రోజు ప్రమోషన్ వచ్చింది. ఆమెకు ఎస్పీ(నాన్ క్యాడర్) హోదా దక్కింది. 1989లో పోలీసు శాఖలో జాబ్ సాధించారు. 2018లో DSPగా ప్రమోషన్ వచ్చింది. ASPగా శ్రీసిటీ, వైజాగ్, తిరుపతిలో బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్పీ హోదాలో ఇవాళ ఏసీబీ జేడీగా బాధ్యతలు స్వీకరించి సాయంత్రం రిటైర్మెంట్ తీసుకోనున్నారు.
W.G: తణుకు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాదారులు తెలిపారు.
ప్రకాశం: సంతనూతలపాడులోని పెద్ద చెరువు కట్ట వాటర్ ప్లాంట్ సమీపంలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధమైంది. వాహనదారుడు పాల ప్యాకెట్లు తీసుకువస్తుండగా వాహనం బాగా వేడెక్కడంతో కొద్దిసేపు వాహనం ఆపినట్లు తెలిపాడు. ఇంతలోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగసిపడి ప్రమాదం జరిగిందని స్కూటీ యజమాని వెల్లడించాడు.
E.G: రాజానగరంలోని ‘సీ కన్వెన్షన్’ హాల్లో ‘పీ-4’ కార్యక్రమ మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో MLA బత్తుల బలరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పీ-4 పథకం ద్వారా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మెరుగైన అభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలో ఈ పథకం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని పేర్కొన్నారు.
ASR: గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 3,426 పీఎం జన్మన్ గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. పూర్తి అన్ని మౌలిక వసతుల సదుపాయంతో 1,385 గృహాలను జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం గృహప్రవేశాలు జరిగాయన్నారు.
ATP: కళ్యాణదుర్గం ప్రాంతంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతామని MLA అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. పీ4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం CM చంద్రబాబు విజన్ 2047తో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. తిమ్మసముద్రం ఏపీఐఐసీ భూముల్లో చిన్న పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉన్న వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ సందర్శించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఏర్పాట్లు ఎస్పీ పరిశీలించనున్నారు.
W.G: రహదారుల అభివృద్ధి పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇవాళ ఉదయం తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కీలక రహదారులైన తాడేపల్లిగూడెం, భీమవరం రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ జిల్లా సమీక్షలో తాడేపల్లిగూడెం ప్రజాప్రతినిధులు ఉన్నారు.
TPT: సత్యవేడు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎంపికయింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బీ. మహేష్, కార్యదర్శిగా బీ.రాజా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పదవిలో ఉన్నంతవరకు అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి మంచి సేవలు అందిస్తామన్నారు.
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 2న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వ్రతం కొనసాగుతుందన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులకు టికెట్టు రూ. 300 గా నిర్ణయించామన్నారు.
NLR: గురుకులాల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ జి. మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. నెల్లూరు చిలమానుచేను పాఠశాలలో 5వ తరగతితో పాటు 6,7,8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వివరాల ఇలా ఉన్నాయి. అత్యధికంగా రెంటచింతలలో 39 డిగ్రీల గరిష్ఠ, 23 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 38, కనిష్ఠంగా 23 డిగ్రీలుగా రికార్డైంది. నరసరావుపేటలో 38-22, తెనాలిలో 36-23 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.