VSP: GVMC కమిషనర్ ఇటీవల విశాఖ ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన స్పీడ్ లేజర్ గన్స్ను త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు బీచ్ రోడ్డులో ట్రయిల్ రన్ నిర్వహించారు. నేటి నుంచి ఈ స్పీడ్ లేజర్ గన్స్ నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసిన వారికి చలానాలు వేయనున్నారని తెలిపారు. 40KMలకు మించి అతి వేగం,హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి ఉల్లంఘనలకు చెక్ పెట్టి చలానాలు విధిస్తామన్నారు.
NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వేగూరు పంచాయతీలో రూ. 2.78 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కోవూరు MLA ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రతి గ్రామంలో తాగునీరు, స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని దానికి అనుగుణంగా దాదాపు పూర్తి చేశామన్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్, డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులను చేశామన్నారు.
అన్నమయ్య: సంబేపల్లి మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ప్రజాసేవతోనే పార్టీ బలపడుతుందని అన్నారు.
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ (IPS)ను కేంద్ర ప్రభుత్వ హిందీ సలహాదారు ఎస్. గైబువల్లి, మాజీ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఎం.ఎం.డి. ఇమామ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఎస్పీతో కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించారు.
KKD: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సామర్లకోట పట్టణ పరిధి 3వ వార్డు అంబేద్కర్ కాలనీలో వార్డు ఇంఛార్జ్ దాట్ల సత్యవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అందుగుల మణి కుమారి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు
అన్నమయ్య: మదనపల్లిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి PGRS కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంఛార్జ్ మంత్రితో P-4, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ATP: రాప్తాడు నియోజకవర్గం కురుగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు తెలుగు రైతు అధ్యక్షుడు కురుగుంట నారాయణస్వామి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.
ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి సమేత గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయంలో ఆదివారం కామధ ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు సుధీంద్ర నాథ్ స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తులసిమాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
SS: జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ఎన్.కార్డ్ (N.CORD) కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు.
ELR: దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KRNL: గార్గేయపురం చెరువులో ఏప్రిల్ 2న జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ఇవాళ తెలిపారు. అండర్-15, 18 విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన వారు ఏప్రిల్ 11-12 తేదీలలో NTR జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆసక్తిగల క్రీడాకారులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి బదిలీ అయ్యారు. ఆమెను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషాంతి బదిలీతో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆమె స్థానంలో ఇంఛార్జ్ జేసీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
VZM: ఇరాన్పై అమెరికా సామ్రాజ్యవాద యుద్ధం ఆపాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. అమెరికా తమ ఆయుధ వ్యాపారాన్ని అభివృద్ధికే యుద్దం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
KRNL: రాయలసీమ కరవు మండలాల జాబితాలో ఆదోని మండలానికి చోటు లేకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. వర్షాకాలంలో పంటలు దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను పరిశీలించకుండా జాబితా రూపొందించారని విమర్శిస్తున్నారు. కరవు గుర్తింపులో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KKD: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పుట్టిన తెలుగువారి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఆదివారం చిన శంకర్లపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ TDP జెండాను ఆవిష్కరించారు.