• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దేవస్థానంలో కూచిపూడి నృత్యం

కోనసీమ: అమలాపురం మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరంకు చెందిన కూచిపూడి నృత్య నికేతన్ నాట్య చారిణి వై కళ్యాణి మాధవి, అమలాపురం శిష్య బృందం నాట్యం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. 

March 29, 2026 / 01:46 PM IST

పట్టణ BJPమహిళ మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వర

CTR: పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో ఆదివారం బీజేపీ పార్టీ సమావేశం జరిగింది. జిల్లా స్థాయి నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మను నియమిస్తూ.. జిల్లా మహిళ అధ్యక్షురాలు కవిత రాజు ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

March 29, 2026 / 01:35 PM IST

కోడుమూరులో ముగ్గురు పిల్లలు అదృశ్యం

KRNL: కోడుమూరు కాలమ్మ వీధికి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చరణ్, ఈరన్న, కిరణ్ శనివారం సాయంత్రం నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా సమాచారం దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు ఇవాళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

March 29, 2026 / 01:35 PM IST

తిరుమలలో వసంతోత్సవాలు: ఆర్జిత సేవలు రద్దు

TPT: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు ఘనంగా జరుగనున్నాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాల నేపథ్యంలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ముఖ్యంగా మార్చి 31న అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 29, 2026 / 01:23 PM IST

‘ఈనెల 31లోగా వంద శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి’

AKP: కోటవురట్ల మండలంలో ఈనెల 31లోగా వంద శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. ఆదివారం కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటి పన్నులు వసూలు చేశారు. మండలంలో మొత్తం రూ.77.66 లక్షలు వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.63.87 లక్షలు వసూళ్లు చేసామన్నారు.

March 29, 2026 / 01:19 PM IST

జన్యుపరమైన వ్యాధులపై అవగాహన: అపోలో వీసీ

చిత్తూరులో అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.వినోద్ భట్ డౌన్ సిండ్రోమ్ అవేర్నెస్ డే వర్క్ షాప్ ప్రారంభించారు. జన్యు పరమైన వ్యాధుల నిర్ధారణలో ఆధునిక విధానాలు కీలకమన్నారు. ప్రొఫెసర్ సుభద్ర దేవి డేటా సేకరణలో లోపాలున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరించాలని కోరారు. పేరెంట్ గైడ్ విడుదల చేశారు.

March 29, 2026 / 01:16 PM IST

సీఎంపై వైసీపీ నేతలు ఫైర్

కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం చేయలేనందుకే చట్టబద్ధత పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక సమావేశం రైతులకు, ప్రజలకు మేలు చేస్తుందని భావించినా, అది కేవలం రాజకీయ విమర్శలకు, సెల్ఫ్ ప్రచారానికి మాత్రమే పరిమితమైందని అన్నారు.

March 29, 2026 / 01:15 PM IST

క్రోసూరులో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

PLD: క్రోసూరులో మట్టల ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పూర్వం నజరేయుడైన యేసుక్రీస్తు గాడిదపై యెరూషలేములోకి ప్రవేశించిన చారిత్రక ఘట్టాన్ని స్మరిస్తూ పాస్టర్లు, విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సండే స్కూల్ విద్యార్థులు, చిన్నపిల్లలు చేతుల్లో ఈత మట్టలు పట్టుకుని “హోసన్నా.. క్రీస్తు రాజుకు జై” అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు.

March 29, 2026 / 01:12 PM IST

గమేళాలు తలపై పెట్టుకుని మంత్రి శ్రమదానం

W.G: మనిషి ఆఖరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలన్న లక్ష్యంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం పాలకొల్లు క్రిస్టియన్ శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్వయంగా కార్మికులతో కలిసి గమేళాలతో కంకర, ఇసుక, సిమెంటు మోస్తూ స్లాబ్ శ్మశాన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని శ్మశానాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 29, 2026 / 01:10 PM IST

కర్నూలులో ప్రజా ఫిర్యాదుల వేదిక

కర్నూలు నగరపాలక సంస్థలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని సమావేశ భవనంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ అర్జీలను సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అర్జీ స్థితిని https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

March 29, 2026 / 01:07 PM IST

బెల్ట్ షాపులు నిషేధించాలని రోడ్డెక్కిన మహిళలు

TPT: కోటపోలూరు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే నిషేధించాలని గ్రామంలోని మహిళలు కథం తొక్కారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామ నడిబొడ్డున నిరసన తెలియజేశారు. ఈ బెల్ట్ షాప్స్ మూలంగా తమ భర్తలు, పిల్లలు మద్యానికి బానిసలవ్వడంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

March 29, 2026 / 01:05 PM IST

సూర్యనారాయణ రెడ్డిని పరామర్శించిన కేతిరెడ్డి

SS: ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి గ్రామానికి చెందిన చెంచాని సూర్యనారాయణ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యానికి గురైన సూర్యనారాయణ రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

March 29, 2026 / 01:04 PM IST

రేపు యధావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు మార్చి 30వ తేదీన యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల & మున్సిపాలిటీ స్థాయిలలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

March 29, 2026 / 01:04 PM IST

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మడ గ్రామంలో తెలుగు దేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు. ప్రజా సేవే పార్టీ ప్రధాన లక్ష్యమని, అదే దిశగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.

March 29, 2026 / 01:04 PM IST

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

GNTR: గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జిల్లా నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని, పార్టీ సిద్ధాంతాలను స్మరించుకున్నారు.

March 29, 2026 / 01:00 PM IST