GNTR: వైసీపీ ఎస్టీ సెల్ (మైదానప్రాంత) రాష్ట్ర అధ్యక్షుడిగా గుండా సురేంద్ర నియమితులయ్యారు. గతంలో ట్రైకార్ ఛైర్మన్గా పనిచేసిన ఆయన మైదానప్రాంత గిరిజనుల సమస్యలపై చురుకుగా స్పందించారు. గిరిజనులకు పార్టీకి మధ్య వారధిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు మండలం బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి జాతర సందర్భంగా ఈ నెల 23న అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు హనుమంతు శుక్రవారం తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన కాడెద్దులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 20 వేలు, తృతీయ బహుమతిగా రూ. 15 వేలు, నాల్గవ బహుమతిగా రూ. 10 వేలు, ఐదవ బహుమతిగా 5 వేలు అందజేస్తామన్నారు.
VZM: బొబ్బిలి మండలం ఓ గ్రామంలో గురువారం గంజాయితో విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. కళాశాల వద్ద గంజాయి తాగుతునట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతుంది.
W.G: ఉమ్మడి జిల్లాల పరిధిలోని జలవనరుల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘లైడార్’ విమానం ద్వారా ఆకాశంలో సర్వే పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 20న నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, గణపవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పరిసరాల్లో, 21న పేరుపాలెం, మొగల్తూరు, భీమవరం, వీరవాసరం, ఉంగుటూరు, భీమడోలు ప్రాంతాల్లో విమానం ద్వారా సర్వే జరగుతుంది.
KDP: శుక్రవారం కమలాపురం మండలం గొల్లపల్లి బ్రిడ్జి సమీపంలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగుంట్ల వైపు నుంచి వెళ్తున్న రెండు ఇసుక టిప్పర్లను వెనుక నుంచి వస్తున్న ఒక వాహనం బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం, గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
SS: జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాలను సంప్రదించి టెండర్ నిబంధనలు, దరఖాస్తు గడువు వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
SS: జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాలను సంప్రదించి టెండర్ నిబంధనలు, దరఖాస్తు గడువు వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
CTR: చిత్తూరు మెప్మా-నిపుణ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నాగయ్య కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకే మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 8121212873 నంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: బుచ్చయ్యపేట మండలం కొత్త కొండెం పూడిలో పదో తరగతి విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కొంతమంది వెండి పట్టీలు దొంగతనం చేశారని నెపం మోపడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. కుమారుడి మృదేహాన్ని చూసి తల్లిదండ్రులు తలారి మంగపతి, భవాని కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాయదుర్గం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
TPT: వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ తులసి జ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా మార్చి 31వ తేదీ వరకు అర్జీలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు, 27 ఫలితాలు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
NDL: ఈ నెల 26న ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఇవాళ తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,250 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–30 ఏళ్ల వయసు గల యువత అర్హులన్నారు. సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు.
NLR: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
CTR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు చేయాలన్నారు. నో సెల్ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
SKLM: జలుమూరు మండలం శ్రీ ముఖలింగం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కె.ఏడు కొండలు గురువారం ప్రకటనలో తెలిపారు. ఆలయ నిబంధనల మేరకు దేవ దాయ శాఖ అధికారులు, పాలక మండలి, అర్చకుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.