ATP: పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.