CTR: కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ. 50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ. 1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.
SKLM: జిల్లాలో వచ్చే నెల 13 నుంచి 15 వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. సబ్కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో క్రీడలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
KDP: పులివెందుల పట్టణానికి చెందిన బాలిక(17) అదృశ్యమైనట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు SI తిమోతి తెలిపారు. SI వివరాల మేరకు.. బాలిక చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
PPM: ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హాజరు తక్కువగా ఉందని కండోనేషన్ ఫీజు వసూలు చేయాలని చూస్తే వారిపై చర్యలు తప్పవనిమన్యం DIEO వై. నాగేశ్వరరావు హెచ్చరించారు. కండోనేషన్ ఫీజు ఉన్న విద్యార్థులు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చునన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో 17,530 మంది పరీక్షలు రాయనున్నారు.
CTR: కోకో పంటలు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 9 వేల హెక్టార్లలో కోకో పంట సాగులో ఉంది. నాణ్యతను బట్టి కిలోకు గరిష్టంగా రూ. 380 మాత్రమే లభిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. గత ఏడాది రూ. 650 వరకు ధర లభించిందని చెప్పారు. పంట సాగుకు పెట్టుబడులు అధికం కావడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నట్లు వాపోయారు.
SKLM: నరసన్నపేట పట్టణం తంబకాయ కూడలు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. తంబకాయ కూడలు వద్ద మలుపు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు పోలీసులు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ను ఉపయోగించి మహిళలు తమకు తామే రక్షణ కల్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు. మహిళల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను వారికి వివరించారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ను పరీక్షల విభాగం అధికారి ఉదయభాస్కర్ విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయన్నారు.
ATP: గుత్తి రైల్వే జంక్షన్లో శుక్రవారం తెల్లవారుజామున కదులుతున్న రైలులో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్కు చెందిన అరుణ అనే మహిళ ప్రయాణికురాలి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్ళాడు. ఈ ఘటనపై బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
AKP: నర్సీపట్నంలో ఈ నెల 24వ తేదీన రిషి డిగ్రీ కాలేజ్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ గోవిందరావు తెలిపారు. 17 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల నిరుద్యోగులు పదో తరగతి, డిగ్రీ, పీజీ, ఐటిఐ డిప్లొమా చేసిన నిరుద్యోగులు హాజరు కావాలని సూచించారు.
PLD: ఈనెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు పల్నాడు జిల్లాలో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిణి నీలావతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరకానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 2, 13 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ మేరకు వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న శుభ్రత పనులను పరిశీలించారు. పనులు సక్రమంగా నిర్వహించాలని, చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
VSP: చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో అడ్డుగా ఉన్న భారీ వృక్షాల వల్ల పనులు నిలిచిపోగా, తాజాగా జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అడ్డంకులు తొలగడంతో త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. పాదచారుల చిరకాల స్వప్నమైన ఈ ఫుట్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.
ప్రకాశం: కంభం పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆటో ఆగి ఒక్క సారిగా రివర్స్ చెయ్యడంతో వెనుక నుండి కార్ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు, కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఆటో, కారు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
NLR: విజయవాడలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ మేధావుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, ముస్లిం మత పెద్దలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి పవిత్ర గ్రంథమైన ఖురాన్ను, రంజాన్ తోఫాను అందజేశారు.