• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రైతులందరూ తప్పనిసరిగా Farmer ID కలిగి ఉండాలి’

కాకినాడ జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ APFR Farmer ID కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు గాను, కేవలం 1.69 లక్షల మందికే ఐడీ ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ఉన్నవారికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల బీమా వంటి పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.

February 20, 2026 / 07:04 AM IST

తిరుమలలో మిస్సింగ్ బాలికలు సురక్షితం

తిరుమలలో కనిపించకుండా పోయిన 5 ఏళ్ల నవదుర్గ, 3 ఏళ్ల అశ్విని అనే ఇద్దరు బాలికలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు జరిపి, చిన్నారులను అపహరించిన మహిళను కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

February 20, 2026 / 07:04 AM IST

రైతుల సమస్యలపై గోడపత్రిక ఆవిష్కరణ

NTR: తిరువూరులో కౌలు రైతుల సమస్యలపై రైతులు గోడపత్రికను నిన్న ఆవిష్కరించారు. రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. భూమి లేని కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, అన్నదాత సుఖీభవ పథకంలో సాగు ఖర్చుల కోసం కౌలు రైతులకు రూ.20,000 ఇవ్వాలన్నారు. ఈనెల 23, 24 తేదీలలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే 36 గంటల దీక్షలకు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

February 20, 2026 / 07:02 AM IST

మంత్రి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ గురువారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఉగ్ర కుటుంబ సభ్యులను మంత్రికి పరిచయం చేశారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

February 20, 2026 / 07:02 AM IST

మచిలీపట్నంలో కాంట్రాక్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు

కృష్ణా: కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను కాంట్రాక్ట్ లో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ వెల్లడించారు. ఈనెల 23న ఇంగ్లీషు, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ PGT పోస్టులకు, 24న కంప్యూటర్ ఆపరేటర్, వృత్తి ఉపాధ్యాయుడు, క్రీడల కోచ్, కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్సు పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉంటయి.

February 20, 2026 / 07:01 AM IST

నేడు అల్పపీడనం.. ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

CTR: హిందూ మహాసముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలోనూ వానలు పడతాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఈనెల 22వ తేదీ నుంచి వర్షాలకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.

February 20, 2026 / 06:59 AM IST

కందుకూరులో ఆటో బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

NLR: కందుకూరు పట్టణంలోని శివారులో దూబగుంట ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఒక ఆటో బోల్తా పడింది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సంఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. బైక్ పై ఉన్నవారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు.

February 20, 2026 / 06:49 AM IST

‘మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదు’

E.G: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని MLA మద్దిపాటి వెంకటరాజు హెచ్చరించారు. గురువారం అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో ఆయన మాట్లాడారు. భోజనం నాణ్యతపై ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. తాను ఆకస్మికంగా పాఠశాలలను సందర్శిస్తానన్నారు

February 20, 2026 / 06:46 AM IST

గుంపర్రులో వైసీపీ కార్యవర్గ సమావేశం

W.G: గుంపర్రు గ్రామ వైసీపీ కార్యవర్గ సమావేశం గురువారం నియోజకవర్గం ఇన్‌ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ, మండల అనుబంధ కమిటీల నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టాల్సిన చర్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. గ్రామ అధ్యక్షుడిగా సుబ్బారావును ఎన్నుకున్నారు.

February 20, 2026 / 06:40 AM IST

ఎస్కేయూ పరిధిలో ఎనిమిది మంది విద్యార్థులు డిబార్

ATP: ​శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 8 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. అనంతపురం నగరంలోని ఎస్ఎల్ఎన్, శ్రీవాణి డిగ్రీ కళాశాలల్లో ముగ్గురు చొప్పున, గోరంట్లలోని ఎస్వీపీఎం కళాశాలలో ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ వెల్లడించారు.

February 20, 2026 / 06:38 AM IST

నేడు కొప్పవరం జంక్షన్లో ఎంపీ ‘ప్రజాదర్బార్’

KKD: సామర్లకోట మండలం కొప్పవరం జంక్షన్ వద్ద గల రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఎంపీ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చు.

February 20, 2026 / 06:37 AM IST

నేడు సీఐ నూతన కార్యాలయం ప్రారంభం

కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో దాతల సహకారంతో నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నూతన కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించనున్నారు. 1993 నుంచి అద్దె భవనంలో కొనసాగిన కార్యాలయానికి ఇది శాశ్వత పరిష్కారం కానుంది. హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు స్టేషన్లకు ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేయనున్నాయి.

February 20, 2026 / 06:32 AM IST

మార్కాపురంలో నేడు పవర్ కట్

ప్రకాశం: మార్కాపురంలో ఏబీ స్విచ్ ఫిక్సింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డులో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 06:32 AM IST

నేడు గుంటూరులో ఈ-వ్యర్థాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్

GNTR: పర్యావరణ పరిరక్షణ కోసం శుక్రవారం గుంటూరు నగరవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పాత మొబైళ్లు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు వీలుగా ప్రజలందరూ సహకరించాలన్నారు.

February 20, 2026 / 06:31 AM IST

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

VSP: వేపగుంట మండలం విరాట గర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. దీనివల్ల బాలాజీగార్డెన్స్, శ్రీనివాసనగర్, గొల్లనారాయణ పురం, దత్తసాయినగర్, సింహాద్రినగర్, తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు.

February 20, 2026 / 06:31 AM IST