TPT: పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ బాలికను తిరుపతికి చెందిన యువకుడు యూసఫ్ (23) మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 110 కిలోల ముత్యాలను కానుకగా ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కోవూరు MLA,TTD పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముందుకొచ్చినట్లు డిప్యూటీ ఈవో ఏ.ప్రశాంతి గురువారం తెలిపారు.
CTR: చిత్తూరు మురకంబట్టులోని చిత్తూరు-పూతలపట్టు రైల్వే మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులను శుక్రవారం ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రావెల్ క్రాసింగ్ నంబరు 22 పూర్తి ట్రాక్ను అప్ గ్రేడేషన్ చేయనుండటంతో శుక్రవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపునున్నట్లు చెప్పారు.
AKP: సంప్రదాయం మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ మత్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం పాయకరావుపేట సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు ఉన్న మత్స్యకారులను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయన్నారు. ఏ పార్టీ ఇప్పటివరకు మత్స్యకారులకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.
VZM: ఈ నెల 23 నుంచి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈశ్వరరావు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 30 వరకు గడువు ఉందని ఆసక్తి గల విద్యార్థులు WWW.CSe.ap.gov.in/ www.apms.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పూర్తి వివరాలకు పాఠశాల పనిచేయు వేళల్లో సంప్రదించవచ్చుని పేర్కొన్నారు.
E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామానికి చెందిన గంగలూరి పాపయమ్మకు రూ.23,400, రెక్కల చంటిబాబుకు రూ.52,723 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
PLD: మాచర్ల పురపాలక పరిధిలో ఈ-వ్యర్థాల సేకరణకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి పార్క్ సెంటర్ వరకు ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి నెల 10, 20 తేదీల్లో ఈ సేకరణ ఉంటుందని, ప్రజలు తమ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ కార్యాలయంలోని కలెక్షన్ సెంటర్లో అందజేయాలని ఆయన కోరారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక పాతూరు ఎస్సీ పాలెంకు చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కనిగిరి ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసి గురువారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ ఈ కేసులో అనంతబాబు భార్యను A-2గా చేర్చారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది
BPT: ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో జరిగిన ఆత్మీయ విందులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సతీమణికి లోకేశ్ మంగళగిరి పట్టుచీరను బహూకరించారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నేతల కలయికతో ఈ భేటీ సందడిగా సాగింది. రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత అనుబంధాలను ఈ సమావేశంలో పంచుకున్నారు.
కృష్ణా: ఉంగుటూరు గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఐ యు. గోవిందు తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
GNTR: తాడేపల్లిలోని సీతానగరం బోట్ యార్డ్ వద్ద గల బకింగ్ హమ్ కాలువ సమీపంలోని చెట్లల్లో ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మృతుడు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుమల కొండలు (45)గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
KDP: సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ZP పాఠశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SI అనిల్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, మత్తు మందులు, గుట్కాలు ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పొద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు.
అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఫోరం ఫర్ బెటర్ ఇండియా అధ్యక్షుడు జి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్కు వినతి పత్రం అందజేశారు. కనీసం పార్కింగ్ ఏర్పాటుకు స్థలం కూడా లేని ప్రాంతంలో బారు నిర్వహణకు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 8 గంటలు వరకు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ పరిధిలో పలు రకాల కార్యక్రమంలో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.