KDP: ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని AP SC కమిషన్ సభ్యులు వెంకటప్ప అన్నారు. ఆదివారం UTF కార్యాలయంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గంలో STలకు చెందిన అసైన్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అడవుల నుంచి వెదురు తెచ్చుకున్నప్పుడు అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు.