ప్రకాశం: దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు సందర్శించేందుకు ఈనెల 7వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి నీరు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు మంత్రి వస్తున్నట్లు తెలుస్తోంది.