ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సీఐ సుబ్బారావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో మద్యం సీసాలను స్థానిక ప్రజలతో కలిసి తొలగించారు. అలాగే జేసీబీతో పిచ్చికంప, పరిసరాలను శుభ్రం చేయించారు. పబ్లిక్ ఏరియాలో మద్యం సేవించడం వల్ల శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడుతుందని, అటువంటి పనులకు దూరంగా ఉండాలన్నారు.