మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గురువారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.