NTR: సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ కిషోర్ బాబు ఆదేశాలతో ధర్నా చౌక్ మీదగా వచ్చేవారు, అలంకార సెంటర్ మీద నుంచి గాంధీనగర్ వైపు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్సై సరళ, ఎఎస్సై మెహర్ బాబు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.