ఏలూరు: భీమడోలులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్నే వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జోహార్ అన్న ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.