కృష్ణా: పామర్రులో జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.2.30 కోట్లతో నిర్మించిన భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్ను MLA వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. గంగానమ్మ గుడి వద్ద 1.50 లక్షల లీటర్ల ట్యాంక్, పైప్లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.2.80 లక్షలతో పంప్హౌస్ను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్తో గ్రామస్తుల తాగునీటి సమస్యలు పూర్తిగా తొలగుతాయని పేర్కొన్నారు.