ప్రకాశం: సింగరాయకొండలో దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారి వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేములపాడు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ హజరతయ్య తెలిపారు. అనుమానిత వ్యక్తులను ఈ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని సీఐ అన్నారు.