AKP: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. మాస్ కాపీయింగ్ జరక్కుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసామన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత పేపర్లను భద్రంగా స్ట్రాంగ్ రూమ్లకు చేరుస్తామన్నారు.