CTR: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి–ముద్దికుప్పం మధ్య రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన చంద్రన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స పొందుతూన్నాడు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.