E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్కు రూ.4,50,000 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శనివారం అందించారు. గతంలో విద్యుత్ షాక్కు గురై ఐదు పాడి గేదలు చనిపోయాయి. అందుకు నష్టపరిహారంగా సీఎంఆర్ఎఫ్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.