AKP: భూములు స్వాధీనానికి వ్యతిరేకంగా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 65వ రోజుకు చేరుకున్నాయి. సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమనాయుడు, శివాజీ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములను తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపాలన్నారు.