అన్నమయ్య: రాజంపేట మండలం పెద్దకారంపల్లె గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ అంతిమ ద్యేయమని తెలిపారు. పథకాల ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ వ్యవసాయ ఖర్చులకు తోడ్పాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.