NLR: జనరంజకంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వెంకటాచలం మండలంలోని కనుపూరులో నిర్వహించిన సుపరిపాలన పై తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథక వివరాలను స్థానిక ప్రజలకు తెలియజేశారు.