ఎన్టీఆర్: అమరజీవి పొట్టి శ్రీ రాములు వర్థంతిని ఆత్మ సంతర్పణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం హర్షణీయమని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం నందిగామ పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.