SRCL: చందుర్తి మండలంలో జూన్ 3 నుంచి 12వ తేదీ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సదస్సులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 వరకు పలు గ్రామాల్లో తేదీలవారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.