VZM: గుర్ల మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేతలు శనివారం సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పధకాలు అమలు చేయలేదని వైసీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు అన్నారు. పార్టీ పిలుపుతో వచ్చే నెల 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నామని, వైసీపీ శ్రేణులు హాజరుకావాలన్నారు.