AP: పింఛన్లు పెంచుతామని చెప్పాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాదిలో పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేశామని, పింఛన్లు పెంచిన ఘనత టీడీపీదేనని తెలిపారు. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ ఇంతలా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. 3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామన్నారు. ఆదాయాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ పింఛన్లు ఇచ్చామన్నారు.