W.G: తాడేపల్లిగూడెంలో ఏలూరు కాలువ ఆధునీకరణ పనులను శనివారం ప్రత్యేక అధికారి సూర్య కుమారి (ఐఏఎస్), జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. నవాబుపాలెం నుంచి ఉప్పాకపాడు చెక్ పోస్టు వరకు సుమారు 13 కిలో మీటర్ల ఆధునీకరణ పనులు నిర్వహించనున్నారు. వారి వెంట ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.